పాలమూరు, డిసెంబర్ 25 : పాలమూరు అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. సోమవారం జిల్లా కేంద్రంలోని అయ్యప్పకొండపై ఆల య వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రెడ్క్రాస్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో స్వాములు రక్తదానం చేశారు. అలాగే తూర్పు కమా న్ నుంచి అయ్యప్ప కొండ వరకు స్వామి పల్లకీ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. స్వా మియే శరణమయ్యప్ప అంటూ స్వాములు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. భక్తిగీతాలు, భజనలు, నృత్యాలు చేస్తూ స్వామిని కొలిచారు.
శోభాయాత్ర ఆద్యంతం వైభవంగా సాగింది. ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ పాల్గొని పూజలు చేశారు. రాత్రికి వెంకటేశ్వర చంద్రమౌళిశర్మ గురుస్వామి ఆధ్వర్యంలో మహాపడిపూజ కనులపండువగా జరిగింది. వేలాదిగా అయ్యప్పస్వాములు పాల్గొన్నారు. కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షుడు భగవంతాచారి, రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్, గురుస్వాములు అన్వేశ్, మా లాద్రి, సంతోశ్, స్వాములు, భక్తులు పాల్గొన్నారు.