అమ్రాబాద్, డిసెంబర్ 21 : తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవస్థానం. నాగర్కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిలో మన్ననూర్ నుంచి 52 కిలోమీటర్ల దూరంలో నల్లమల అటవీప్రాంతంలో మద్దిమడుగు అంజన్న ఆలయం ఉన్నది. పచ్చదనపు ప్రదేశాలకు నిలయమైన నల్లమల కొండ ల్లో ప్రవహించే కృష్ణానది, ఉత్తర వాహినిగా పచ్చిమ భాగమున దుందుభీనది సంగమించి రెండు నదుల కలయిక నడు మ ప్రదేశానికి 12 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి రమణీయ దృశ్యముల మధ్య ప్రకృతి ఒడిలో సహజంగా వెలిసిన మద్దిమడుగు పుణ్యక్షేత్రానికి కృష్ణానది ఒక ఆభరణం లాంటిది.
ఆంజనేయస్వామి ఆలయం పక్కనే కోటగోడకు వెలిసిన అమ్మవారిని కోటమైసమ్మగా భక్తులు పిలుచుకుంటారు. అ త్యంత మహిమాన్విత శక్తిక్షేత్రంగా కోటమైసమ్మ అమ్మవారు అగ్రస్థానాన్ని వహిస్తున్నది. ప్రతి ఆదివారం భక్తులు అధికసంఖ్యలో ఆలయాన్ని దర్శించుకొంటారు. సహస్త్ర కోటి నామాలతో పిలుపును అం దుకుంటున్న జగన్మాత పంచేంద్రియాలను నిగ్రహిస్త్తూ పంచభూతాత్మకమైన శరీరాన్ని భరిస్తూ ప్రకృతి శక్తులను నియంత్రిస్తూ కలియుగంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి ఈ క్షేత్రంలో కోట మైసమ్మ అమ్మవారిగా వెలిసింది.
హనుమాన్ మాలధారణ ఏడాదిలో రెండు పర్యాయాలు చైత్రమాసం, కార్తీకమాసం నెలల్లో అర్దమండలం (21 రోజు లు), మండలం (41 రోజులు) దీక్ష చేపట్టి ఇరుముడితో మద్దిమడుగు చేరుకొని స్వా మివారికి ఇరుముడులు సమర్పిస్తారు.
మద్దిమడుగు ఆంజనేయస్వామి ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం నిత్యార్చన విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, పంచగ వ్యం, యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూ జ, పుణ్యాహవాచనం, ధ్వజారోహణం, ఊష్ణవాహనసేవ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
23న (శనివారం) ఉదయం వి ఘ్నేశ్వరపూజ పంచగవ్యం, వాస్తుపూజ హోమం, రుద్రహోమం, స్వామి వారి సహస్రనామార్చన, బలిహరణ, నీరాజన మంత్రపుష్పం, సాయంత్రం నిత్యోపాసన మన్యుసూక్త హోమం, బలిహరణ తీర్థప్రసాద వితరణ, రాత్రికి అశ్వవాహనసేవ నిర్వహిస్తారు.
24న (ఆదివారం) ఉదయం విఘ్నేశ్వరపూజ, రుద్రహోమం, నిత్యోపాసన బలిహరణ, మహానివేదన నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం, హనుమాన్వ్రతం,మధ్యాహ్నం నిత్యోపాసనామాలు, బలిహరణ, రాత్రికి పార్వతీపరమేశ్వరుల కల్యాణమహోత్సవం, మం గళహారతి, గజవాహనసేవ నిర్వహిస్తారు.
25న (సోమవారం) ఉదయం విఘ్నేశ్వరపూజ, రుద్రహోమం, నిత్యోపాసన బలిహరణ, మహానివేదన నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం, రాత్రికి సీతారాముల కల్యాణమహోత్సవం, గరుఢవాహనసేవ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా రాత్రి 9:30 గంటలకు హనుమాన్ మహాపడిపూజ కార్యక్రమం హనుమాన్ మాలధారుల సమక్షంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు.
26న (మంగళవారం) ఉదయం గవ్యంతరపూజలు, మన్యుసూక్తములతోపాటు ఆంజనేయస్వామివారికి 108 కలశాలతో మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం హనుమాన్ గాయత్రి మహాయజ్ఞం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
హనుమాన్ మాలధారణ చేపట్టిన భక్తులు (స్వాములు) 22 నుంచి 26వ తేదీ వరకు మాల విరమణ కార్యక్రమాలు స్వామివారి సన్నిధిలో నిర్వహిస్తారు.
శుక్రవారం నుంచి ఐదు రోజులపాటు జరిగే మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి మాలవిరమణ, గాయత్రి మహాయజ్ఞ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం, విడిది, దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. భక్తులు అధికసంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలి.