తిమ్మాజిపేట, డిసెంబర్ 31 : ఉమ్మడి జిల్లా పరిధిలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. తిమ్మాజిపేట టీఎస్బీసీఎల్ స్టాక్ పాయింట్లో ఈ సంవత్సరం ముగింపు నెల డిసెంబర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని 153 మద్యం దుకాణాలు, 23 బార్లలో రూ.203 కోట్లు అమ్మకాలు జరిగాయి. ఈ నెలలో ఎన్నికల ఫలితాలు వెలువడడం, న్యూ ఇయర్ కావడంతో అమ్మకాలు భారీ గా పెరిగాయి. సాధారణంగా ప్రతి నెలా రూ.150 కోట్ల వరకు ఉండే అమ్మకాలు డిసెంబర్లో రూ.50కోట్ల మేర పెరిగాయి. 2.09 లక్షల కేసులు లిక్కర్, 2.51లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి.