అయిజ, ఆగస్టు 27 : తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతున్నది. శనివారం ఇన్ఫ్లో 84,959, అవుట్ఫ్లో 84,959 క్యూసెక్కు లు నమోదైంది. ప్రాజెక్టులో 28 గేట్లు ఎ త్తారు. 105. 788 టీ ఎంసీ ల పూర్తిస్థాయి నీటి నిల్వకుగానూ ప్రస్తుతం 104.624 టీఎంసీలు నిల్వ ఉన్నది. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టలో ఇన్ఫ్లో 85,920, అవుట్ ఫ్లో 85,500 క్యూసెక్కులు నమోదైంది. ఎగు వ నుంచి వచ్చే వరద ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆయకట్టుకు 420 క్యూసెక్కులు వదిలారు. ఆ నకట్టలో 12.4 అడుగుల నీటిమట్టం ఉన్నది.
జూరాలలో..
అమరచింత, ఆగస్టు 27 : ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టులోకి వరద పెరిగింది. శనివారం సాయంత్రం 98 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి నీటిని దిగువ కు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తికి 42,423, ఎడ మ కాల్వకు 920, కుడికాల్వకు 730 క్యూ సెక్కులు వదిలా రు. ప్రాజెక్టు నుం చి 1,12,282 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైనట్లు అధికారు లు తెలిపారు.
శ్రీశైలంలో..
శ్రీశైలం, ఆగస్టు 27 : శ్రీశైలం జలాశయానికి వరద నిలకడగా ఉన్నది. శనివారం సా యంత్రం 1,24,782 క్యూసెక్కుల ఇన్ఫ్లో న మోదైంది. రెండు గేట్ల నుంచి 55,966 క్యూసెక్కులు వదిలారు. ఏపీ పవర్హౌస్లో 30, 980, టీఎస్ పవర్హౌస్కు 31,784 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తు తం 214.3637 టీఎంసీలు నిల్వ ఉన్నది.
సరళాసాగర్ ప్రాజెక్టులో..
మదనాపురం, ఆగస్టు 27 : మండలంలో ని శంకరమ్మపేట గ్రామ శివారులో ఉన్న సరళాసాగర్ ప్రాజెక్టుకు బుర్రవాగు, జంగమాయపల్లి వాగు మీదుగా భారీగా వరద చేరుతున్న ది. దీంతో ప్రాజెక్టులో 2 ఉడ్, 1 ప్రైమరీ సైఫన్ తెరుచుకున్నాయి. పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాసిల్దార్ నరేందర్ కోరారు. మారెడ్డి పల్లి వాగు బ్రిడ్జి దాటేటప్పు డు జాగ్రత్తలు పాటించాలన్నారు.