అలంపూర్, ఏప్రిల్ 11 : మహాత్మా జ్యోతిరావుఫూలే భావి తరాలకు ఆదర్శనీయమని, ఆయన అ డుగుజాడల్లో అందరం నడుద్దామని ఎమ్మెల్యే విజయుడు పిలుపునిచ్చారు. గురువారం అలంపూర్ మున్సిపాలిటీలో నిర్వహించిన ఫూలే జయంతి వే డుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అ నంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు ఫూలే కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, వివిధ ప్రజా, కుల సంఘాల నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.