జడ్చర్ల, జనవరి 21 : జడ్చర్ల మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. పట్టణంలోని 15వ వార్డులో రూ.20లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు నిర్మాణ పనులను శనివారం ప్రా రంభించారు. అంతకుముందు వాసవీమా త ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అ నంతరం కాలనీలో పర్యటించి ప్రజాసమస్యలను తెలుసుకున్నారు. ఇరుకు సందుల్లో సాఫీగా రాకపోకలు సాగించేందుకుగానూ మురుగుకాల్వలపై స్లాబ్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ కు సూచించారు.
అలాగే మంజుల టైలరిం గ్ షాపును పరిశీలించి పక్కనే ఉన్న హోటల్లో మిర్చిబజ్జీలు తిన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలోని అన్ని కాలనీల్లో సీసీరోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, మా ర్కెట్ కమిటీ చైర్మన్ మన్నెం గోవర్ధన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీరవీందర్, వైస్చైర్పర్సన్ సారిక, మార్కెట్ కమిటీ వై స్చైర్మన్ దానిష్, కౌన్సిలర్లు ఉమాశంకర్గౌ డ్, కోట్ల ప్రశాంత్రెడ్డి, నవనీతాకొండల్, లత, చైతన్య, రమేశ్, నందకిశోర్, దేవా, ముడా డైరెక్టర్ ఇమ్మూ, మురళి, నాగిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్యాదవ్ ఉన్నారు.