అదనపు కలెక్టర్ మయాంక్మిట్టల్
నారాయణపేట టౌన్, డిసెంబర్ 1: ఎయిడ్స్వ్యాధిపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ మయాంక్మిట్టల్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లక్షణాలు ఉన్నవారు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఎయిడ్స్వ్యాధికి అ డ్డుకట్ట వేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో రాంమనోహార్రావు, డీఐవో శైలజ, ఐసీటీసీ సిబ్బంది సుధాకర్బాబు, ఏఎన్ఎంలు, ఆశ వర్క ర్లు, పాఠశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
మరికల్లో..
మరికల్, డిసెంబర్ 1: ఎయిడ్స్ డేను పురస్కరించుకొని గురువారం మండల కేంద్రంలో వైద్యసిబ్బంది, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ గోపాల్ మాట్లాడుతూ ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలన్నారు. హైస్కూల్ నుంచి ఇందిరాగాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశ కార్యరక్తలు, పాల్గొన్నారు.
కోస్గిలో..
కోస్గి, డిసెంబర్1: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వైద్యసిబ్బంది పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గురువారం డాక్టర్ రాఘవేందర్ ఆద్వర్యంలో పీహెచ్సీ సిబ్బంది కోస్గి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. హెచ్ఐవీ వైరస్ ద్వారా వ్యాప్తిచెందే ఎయిడ్స్ మహమ్మారికి నివారణ ఒక్కటే మార్గమని సూచించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది సూపర్వైజర్ రాంచందర్, మణిమాల, సిబ్బంది నీ లమ్మ, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మాగనూర్లో..
మాగనూర్ డిసెంబర్ 1: మాగనూర్ మండల కేంద్రం లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన సిబ్బంది జిల్లా పరిషత్ ఉన్నాత పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించా రు. ఈ సందర్భంగా సూపర్వైజర్ యాదమ్మ మాట్లాడుతూ ఎయిడ్స్పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపరాదన్నారు. సమిష్టిగా ఎయిడ్స్ ను నియంత్రించాలని కోరారు. కార్యక్రమలో సూపర్వైజర్ వెంకటేశ్ యాదమ్మ మల్లేశ్వరి, హెల్త్ అసిస్టెంట్ గోపాల కృష్ణ,అజయ్ ఏఎన్ఎం సుధ, ఆశ వర్కర్ రేణుక తదితరు లు పాల్గొన్నారు.
ఊట్కూర్లో..
ఊట్కూర్, డిసెంబర్ 1 : హెచ్ఐవీ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి అన్నా రు. గురువారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్క రించుకుని మండలకేంద్రంలో పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. పురవీధులగుండా నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్యపర్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ. వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపొద్ద్దని కోరారు. ఎయిడ్స్ నియంత్రణకు తీసుకోవా ల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో ఉప స ర్పంచ్ ఒబేదుర్హ్రమాన్, ఎంపీహెచ్ఈవో విజయకు మార్, సూపర్వైజర్ మణిమాల, పీడీ నర్సింహులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.