పాలమూరు, డిసెంబర్ 1 : ఎయిడ్స్హ్రిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని సీనియర్ సివిల్జడ్జి సంధ్యారాణి అన్నారు. పాలమూరు యూనివర్సిటీలో గురువారం వైస్చాన్స్లర్ లక్ష్మీకాంత్ రాథోడ్ అధ్యక్షతన వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ ఎయి డ్స్ దినోత్సవానికి హాజరై మాట్లాడారు. ముందస్తు జాగ్రత్తలతోనే హెచ్ఐవీ నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. దేశం లో మంచిపౌరులుగా మెలుగుతూ ఎయిడ్స్ మహమ్మారి నిర్మూలనకు కృషి చేయాలన్నారు. అలాగే యువత అభిరుచులు, ప్రవర్తనను గమనించాలని సూచించారు. పీయూ రిజిస్ట్రార్ గిరిజామంగతాయారు మాట్లాడుతూ ఎయిడ్స్ మ హమ్మారిపై పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల ప్రవర్తనను గమనించి సాహిత్యం, క్రీడ ల్లో నిమగ్నం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు.
అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కాగా ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్విజ్, ఉపన్యాస, వ్యాసరచన పోటీల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో శశికాంత్, డిప్యూటీ డీఎంహెచ్వో జరీనాభా ను, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ లయన్ నటరాజ్, పీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ, టీబీ నివారణాధికారి రఫీక్, భాస్కర్నాయక్, సంధ్య, శ్వేత, శ్రీశైలం, రాధ, పీయూ ఓఎస్డీ మధుసూదన్రెడ్డి, ప్రత్యేకాధికారి సోమలింగం, ప్రిన్సిపాల్ బషీర్ అహ్మద్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు గాలెన్న, రవికుమార్, శివకుమార్, ఈశ్వర్, రాఘవేందర్, సుభాషిణి, చిన్నాదేవి, అర్జున్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కౌకుంట్ల మండలంలో..
దేవరకద్ర రూరల్, డిసంబర్ 1 : అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కౌకుంట్లలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిడ్స్, హెచ్ఐవీ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పల్లె దవాఖాన డాక్టర్ రఘువరుణ్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, డిసెంబర్ 1 : ఎయిడ్స్ మహమ్మారిని నిర్మూలించాలని మండల కోఆర్డినేటర్ రాములు అన్నారు. మండలంలోని నాయినోనిపల్లిలో ఆపరేషన్ మెర్సి ఇండియా ఫౌం డేషన్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. అనంతరం గ్రా మస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ వెంకటమ్మ, మహిళా సంఘాల సభ్యులు పద్మమ్మ, చెన్నమ్మ, యాదమ్మ పాల్గొన్నారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, డిసెంబర్ 1 : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మండలకేంద్రంలో వైద్యసిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి రాహుల్ మాట్లాడుతూ ఎయిడ్స్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలని తెలిపారు. ఎయిడ్స్హ్రిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సీహెచ్వో రాము, హెచ్ఎస్ శాంతమ్మ, అలివేలమ్మ పాల్గొన్నారు.