మహబూబ్నగర్ అర్బన్, మే 27 : మహబూబ్నగర్ పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో లీగల్ మెట్రాలజీ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. జిల్లా కేం ద్రంలోని పెట్రోల్ బంకులపై అందుతున్న ఫిర్యాదుల మేరకు జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి రామకృష్ణ ఆ ధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి ఎలాంటి అవకతవక లు లేవని అధికారులు తేల్చారు. బంకుల్లో అంతా సక్రమంగా ఉందని సర్టిఫికెట్లు ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. పాలమూరులోని పలు పెట్రోల్ బంకుల్లో కిరోసిన్ను కలిపి అమ్ముతున్నారని వినియోగదారులు ఫిర్యాదులు చేశా రు. అయితే అధికారుల తనిఖీల్లో ఇవేమీ బయట పడకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. జిల్లా కేంద్రంలోని కైలాష్ ఆటో సైప్లెస్, హైటెక్, రామేశ్వర, ఆర్ఎస్ రాటీ ఫిల్లింగ్ స్టేషన్లపై తనిఖీలు నిర్వహించి ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని తేల్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెట్రోల్ బంకు నిర్వాహకులు ప్రతి రోజూ పెట్రోల్/డీజిల్ డెలివరీ ద్వారా ని ర్ధారించుకున్న తర్వాతే పంపులను వాడాలన్నారు.
పం పులకు ఏడాదికోసారి విధిగా వెరిఫికేషన్ సర్టిఫికెట్ తీ సుకోవాలని, కాల పరిమితి ముగిసిన తర్వాత కూడా వాటిని వాడితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించా రు. వినియోగదారులు కోరితే ఐదు లీటర్ల క్యాన్తో డెలివరీలను చెక్ చేసి చూపించాలని జిల్లా లీగల్ మెట్రాల జీ అధికారి సూచించారు. పై నిబంధనలు ఉల్లంఘించి న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వి నియోగదారులకు సమస్యలు ఎదురైతే లీగల్ మెట్రాల జీ కార్యాలయాన్ని సంప్రదించాలని, వాట్సాప్ ద్వారా 9010651783 నెంబర్కు ఫిర్యాదు చేయొచ్చన్నారు.