ఊట్కూర్, ఫిబ్రవరి 2 : చనిపోయిన వ్య క్తుల సాక్షిగా ఆసరా పింఛన్ డబ్బులను పో స్టల్ బీపీఎం స్వాహా చేసిన ఘటన మండలంలోని చిన్నపొర్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీఎల్పీవో సుధాకర్రెడ్డి క థనం మేరకు.. చిన్నపొర్లకు చెందిన 550 మంది వివిధ రకాల పింఛన్లు పొందుతున్నా రు. దాదాపు రెండున్నరేండ్ల కిందట చనిపోయిన వ్యక్తులను అధికారులు జాబితా నుం చి తొలగించలేదు. దీనిని ఆసరాగా చేసుకున్న పోస్టల్ బీపీఎం రుక్కమ్మ.. పంచాయ తీ కార్యదర్శి శివలీల ఫింగర్ప్రింట్ సాయం తో ఆమెకు తెలియకుండా మృతుల ‘ఆస రా’ డబ్బులను కాజేస్తూ వచ్చింది. కాగా, పింఛన్ పొందుతూ కుటుంబ యజమాని చనిపోతే వారి స్థానంలో భార్యకు వితంతు పింఛన్ అందించేలా ప్రభుత్వం ఇటీవల జీ వో విడుదల చేసింది.
దరఖాస్తు అందిన 15 రోజుల్లో పింఛన్ ఇవ్వాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి బాధ్యతలను అప్పజెప్పిం ది. ఈ మేరకు చనిపోయిన భర్తల స్థానంలో తమకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ కొందరు పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు ఇచ్చారు. విచారణ నిమిత్తం రికార్డులను పరిశీలించిన కార్యదర్శికి అసలు విషయం తెలిసింది. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియకుండానే డబ్బు రికవరీ చేస్తున్నారు. సమాచారం తెలిసిన గ్రామస్తు లు గత సోమవారం కలెక్టర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. డీఎల్పీవో సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఎంపీడీవో కాళ ప్ప, ఎంపీవో వేణుగోపాల్రెడ్డి గ్రామానికి చే రుకొని స్థానికులతో సమావేశమయ్యారు.
చ నిపోయిన చాకలి నారాయణ పేరుపై 30 నె లల పింఛన్ రూ.60,480, అబ్దుల్ రహెమాన్ పేరిట 29 నెలలు (రూ.58,464), మహ్మద్ యూసుఫ్ పేరిట 23 నెలలు (రూ. 46,368), అల్లీసాబ్ పేరిట 23 నెలలు (రూ.46,368), ఉస్మాన్ పేరున 15 నెలల పింఛన్ (రూ.30,240)ను బీపీఎం రుక్క మ్మ స్వాహా చేసినట్లు విచారణలో తేలింది. బీపీఎం మొత్తం రూ.2,41,920 దుర్వినియోగానికి పాల్పడగా.. రూ.1,83,456ను పంచాయతీ కార్యదర్శి రికవరీ చేసి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన బీపీఎం, కార్యదర్శిపై చ ర్యలు తీసుకునేలా కలెక్టర్కు నివేదిస్తామని డీఎల్పీవో తెలిపారు. గ్రామంలో చనిపోయి న, ఆసరా లబ్ధిదారుల వివరాలతో పూర్తి స్థా యిలో విచారణ చేస్తామని పేర్కొన్నారు.