జడ్చర్ల, ఫిబ్రవరి 17 : మండలంలోని గంగాపూర్ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం శకటోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లతో వచ్చిన భక్తులు గుడి ప్రధాన ద్వారం వద్ద పూజలు చేశారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారా ష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివచ్చి చెన్నకేశవస్వామిని దర్శించుకోగా.. పలువురు దా సంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
శకటోత్సవం సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. జాతరలో ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద స్వీట్లు, తినుబండారాలు, ఆటవస్తువులు, గాజులు, కుం కుమ తదిత ర వస్తువులను కొనుగోలు చేస్తూ భక్తులు సందడిగా గడిపారు. ఫ్లైవీల్, రంగులరాట్నంపై చిన్నారులు, పెద్దలు ఎక్కి సరదాగా గడిపారు. జాతర ప్రాంగణంలో సీఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఎల్లమ్మ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.