దేవరకద్ర రూరల్, అక్టోబర్ 26 : అమ్మాపూర్ గ్రామ సమీపంలోని కాంచనగుహలో కొలువైన శ్రీకురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజైన బుధవారం కల్యా ణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామిని ముస్తాబు చేసి పల్లకీలో ఆలయ ప్రాంగణంలో వేదపండితుల మంత్రోచ్ఛారణ లు.. మంగళవాయిద్యాల మధ్య వేడుక నిర్వహించారు. భక్తులు హాజరై మహోత్సవాన్ని తిలకించి తన్మయత్వం చెం దారు.
అంతకుముందు ఉదయం ఆవాహిత దేవతాపూజలు, ధ్వజారోహణం, దేవతాహ్వాన భేరీ పూజ, అష్టోత్తర శతనామాభిషేకం, మయూర వాహన సేవ, మంగళనీరాజనం జరిపారు. కార్యక్రమాల్లో ఆలయ నిర్వహణాధికారి శ్యాం సుందరాచారి, ప్రధాన అర్చకులు వెంకటేశ్వరాచార్యులు, నాయకులు ప్రతాప్రెడ్డి, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.