కొల్లాపూర్, ఫిబ్రవరి 28: ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లికృష్ణారావు ప్రాతినిథ్యం వహిస్తున్న కొల్లాపూర్ ఎంపీపీ పీఠాన్ని మళ్లీ బీఆర్ఎస్సే కైవసం చేసుకున్నది. మండలంలోని ఎన్మన్బెట్ల ఎంపీటీసీ మాలె రజితాభాస్కర్గౌడ్ను ఎంపీపీగా బుధవారం సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇది వరకు ఉన్న ఎంపీపీ సుధారాణి పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఎంపీపీ పీఠాన్ని చేజార్చుకోకుండా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పట్టు నిలుపుకోగలిగారు. ఎన్నికల ప్రత్యేకాధికారి నాగర్కర్నూల్ జెడ్పీ డిప్యూటీ సీఈవో గోపాల్నాయక్ ఆధ్వర్యంలో ఎంపీడీవో పట్టాభిరామారావు, పర్యవేక్షకులు శేఖర్గౌడ్, ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఉదయం 11గంటలకు ఎంపీటీసీ సభ్యులతో సమావేశమయ్యారు. ఎంపీపీ పదవికి ఎన్మన్బెట్ల బీఆర్ఎస్ ఎంపీటీసీ రజితాభాస్కర్గౌడ్ నామినేషన్ వేశారు. ఆమె నామినేషన్ను బోడబండతండా ఎంపీటీసీ శంకర్నాయక్ ప్రతిపాదించగా, రామాపూర్ ఎంపీటీసీ గనమోని వరలక్ష్మి బలపర్చారు.
ఎంపీపీ అధ్యక్ష పదవికి ఒకే నామినేషన్ దాఖలుకావడంతో మిగతా నలుగురు సభ్యులు సైతం ఎంపీపీగా రజితకు అనుకూలంగా మద్దతును ప్రకటించారు. దీంతో ఎన్నికల అధికారి గోపాల్నాయక్ ఎంపీపీగా రజితను ప్రకటించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. నూతనంగా ఎన్నికైన ఎంపీపీకి ఎంపీటీసీలు కొండ్రబుచ్చయ్య. పాండూనాయక్, నాగేంద్రమ్మ, మంజుల, మండల కోఆప్షన్సభ్యుడు హరూన్పాషా పూలమాలలు వేసి అభినందించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ జాఫర్, మాజీ జెడ్పీటీసీ కాటం జంబులయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామచందర్యాదవ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు నిరంజన్, బీఆర్ఎస్ నాయకులు సురేందర్రావు, చింతకుంట రాఘవేందర్, సాంబశివుడుయాదవ్, సాయిరాంయాదవ్, చంద్రశేఖర్శెట్టి, కట్టా శ్రీనివాసులు, రామస్వామి, ధర్మయ్య పాల్గొన్నారు.