కొల్లాపూర్/పెంట్లవెల్లి, మార్చి 29 : ఎవరికి ఏ కష్టం వ చ్చినా నిరంతరం మీ వెంటే ఉంటానని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి భరోసా కల్పించారు. కార్యకర్తలే తమ పార్టీకి పట్టుగొమ్మలని అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలం జటప్రోలులో ఉన్న మదనగోపాలస్వామి జాతర మైదానంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్లు అధ్యక్షతన బుధవారం ఆత్మీయ సమ్మేళనం ని ర్వహించారు. జానపద, గిరిజన సంప్రదాయ నృత్యాలు, ఆ ర్కెస్ట్రా బృందాలతో సభా ప్రాంగణం ఉర్రూతలూగింది. చి త్తూ చిత్తుల బొమ్మ పాటకు మహిళలతో కలిసి ఎమ్మెల్యే బతుకమ్మ ఆడారు. బండారు కురుమయ్య కళాబృందం పాడిన పాటలకు గిరిజన మహిళలు నృత్యాలు చేశారు. 60 ఏండ్ల వృద్ధురాలి డ్యాన్స్ సబికులను ఆకట్టుకున్నది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో కొల్లాపూర్ అభివృద్ధిలో పరుగులు పెడుతున్నదన్నారు. కరోనా కారణంగా రెండేండ్లుగా బీఆర్ఎస్ శ్రేణులతో ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయలేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి సూచనల మేరకు కార్యకర్తల బాధలను తెలుసుకునేందుకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుంటున్నామన్నారు. అంద రం కలిసిమెలిసి కుటుంబసభ్యులుగా ఉందామని పిలుపునిచ్చారు. కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం ఆవిరాళ కృషి చేస్తానన్నారు. జటప్రోల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో సమ్మేళనం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఎన్నో దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న సోమశిల-సిద్ధేశ్వరం వంతెన, జాతీయ రహదారిని మంజూరు చేయించుకున్నామన్నారు. జటప్రోలులో స్థలాన్ని గుర్తిస్తే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. లక్ష్మీసాగర్ ఆనకట్టను పునర్నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యకర్తల కు ఏమైనా అనుకోని ప్రమాదం జరిగితే.. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ రూ.2 లక్షల బీమా సౌకర్యం కల్పించారన్నారు. కొండూరు వద్ద నిర్మించిన చెక్డ్యాం ద్వా రా రైతులకు సాగునీరు అందుతుందన్నారు. పెంట్లవెల్లి-మల్లేశ్వరం మధ్య వాగుపై రూ.10 కోట్లతో చెక్డ్యాం కం హై లెవల్ వంతెన నిర్మించడంతో ఏటిగడ్డ ప్రజలకు రవాణా సౌ కర్యం మెరుగుపడిందన్నారు. పెంట్లవెల్లి చౌట చెరువును రూ.10 కోట్లతో చేపట్టిన మినీ ట్యాంక్ బండ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. కృష్ణానది ఒడ్డున ఉ న్న మంచాలకట్ట గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. గో పాలాపూర్ రైతులకు కెనాల్ ద్వారా సాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. జటప్రోల్లో విద్యుత్ ఫీడర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీసీ ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘువర్ధన్రెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు మతీన్ అహ్మద్, ఎంపీపీ ఉమామహేశ్వరి, సర్పంచులు ఖాజా, నాగరాజు, శ్రీనివాస్రెడ్డి, విజయ్కుమార్, విండో చైర్మన్ రామారావు, ఎం పీటీసీలు హేమలత, ఈశ్వరికుమారి, నాయకులు నరేందర్రెడ్డి, సురేందర్గౌడ్, వెంకటస్వామి తదితరులున్నారు.