కోస్గి, జనవరి 27: 119 నియోజకవర్గాల ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోవడానికే రేవంత్రెడ్డి టీపీసీసీ పదవి తెచ్చుకున్నాడని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికలు వస్తున్నందున రేవంత్కు కొడంగల్ గుర్తుకొచ్చిందా.. అని ఎద్దేవా చేశారు. మా ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమంలో అందించే అద్దాలు పెట్టుకొని కొడంగల్ అభివృద్ధిని చూడాలని, రేవంత్ ఎమ్మెల్యేగా ఉండి చేయని అభివృద్ధిని మేం చేశామన్నారు. మరోమారు నీ చేతిలో మోసపోవడానికి కొడంగల్ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. గురునాథ్రెడ్డి మా కుటుంబసభ్యుడని, అలాంటి వ్యక్తి మీ వెంట ఎలా వస్తాడనుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.