భూత్పూర్, నవంబర్ 26: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాలికా విద్యకు కస్తూర్బా పాఠశాలలు నిలయాలుగా మా రాయి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యాబోధన ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తున్నది. మండలకేంద్రంలోని కస్తుర్బా పాఠశాలలో 206మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో చదివేందుకు ప్రభుత్వ నిబంధనల మేరకు తల్లి లేదా తండ్రి లేనివారికి అవకాశం ఉన్నది. దాదాపు అలాంటి విద్యార్థినులే ఉంటున్నారు. అంతేకాకుండా వందశాతం అక్షరాస్యతను సాధించేందుకు బాలికలను ఈ పాఠశాలల్లో చేరుస్తున్నారు.
పాఠశాలలో విద్యార్థుల సౌకర్యానికి ప్రభుత్వం పక్కా భవనాలను నిర్మించింది. విద్యాబోధనకు శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించింది. ఉపాధ్యాయబృందం తమ బాధ్యతగా విద్యాబోధన చేస్తున్నారు. విద్యతోపాటు భోజన వసతి కల్పిస్తున్నారు. ఉదయం విద్యార్థులకు అల్ఫాహారం, మధ్యా హ్నం గుడ్డుతో కూడిన భోజనం, సాయంత్రం నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. ఆదివారం చికెన్తో కూడిన భోజనం వడ్డిస్తున్నారు. చదువు విషయంలో ఉపాధ్యాయు లు తప్పనిసరిగా పిల్లల వద్దనే ఉంటారు. క్రమశిక్షణతో ఉండేందుకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులు చర్యలు తీసు కుంటున్నారు. 12ఏండ్లుగా 100శాతం ఫలితాలను సాధిస్తున్నారు. ఇందుకోసం ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళి కలను రూపొందించి పాటిస్తున్నారు.
సందేహాలను తీరుస్తున్నారు
నేను ఆరో తరగతి నుంచి ఇక్కడే చదువుతున్నాను. టీచర్లు మాకోసం కష్టపడి విద్యాబోధన చేస్తున్నారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించి సందేహాలను ఎప్పటికప్పుడు తీరుస్తున్నారు. తరగతి గదిలోనే కాకుండా ఎప్పుడు సందేహం వచ్చినా పరిష్కరిస్తున్నారు.
– మంజుల, పదో తరగతి
పది జీపీఏ సాధిస్తా..
నేను రానున్న పదో తరగతి వార్షిక పరీక్షలో 10పాయింట్లు సాధిస్తా. అందుకు మా టీచర్లు నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే టీచర్లు చదివిస్తున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
– అక్షయ, పదో తరగతి
మంచి ఫలితాలు సాధిస్తాం..
రెండు, మూడు సంవత్సరాలుగా కరోనా వైరస్తో విద్యా సంవత్స రం సక్రమంగా జరుగలేదు. ఈ సంవత్సరం అంతా అనుకున్నట్లుగానే తరగతుల నిర్వహణ జరుగుతున్నది. ఈ విద్యా సంవత్సరం మంచి ఫలితాలు వచ్చేలా కృషిచేస్తున్నాము. పాఠశాలలో చిన్న చిన్న సమస్యలున్నాయి. వాటిని వెంటనే పరిష్కరించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఉత్తమ ఫలితాలు సాధించి ఆదర్శంగా నిలబెడుతాం.
– ప్రశాంతి, ప్రత్యేకాధికారి, కేజీబీవీ, భూత్పూర్
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
విద్యార్థులకు ఎలాంటి అనారోగ్యం కలిగినా వెంటనే మా బాధ్యత గా మందులను పంపి ణీ చేస్తున్నాము. విద్యార్థుల ఆరోగ్యం పరిశీలించేందుకే ఏఎన్ఎంగా నా విధులను నిర్వర్తిస్తున్నాను. ప్రతి విద్యార్థిని ప్రత్యేకంగా పరీక్షించి వైద్యపరంగా పలు సూచనలు, సలహాలు ఇస్తున్నాము.
– శ్యామల, ఏఎన్ఎం