నెట్వర్క్ మహబూబ్నగర్, మే 14 : మెరుగైన ఆరోగ్యానికి చక్కటి దివ్యౌషధం కీరదోస. దోసకాయను ఆహారంలో భాగం చేసుకుంటే త్వరగా జీర్ణమవుతుంది. ప్రస్తుత వేసవిలో చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలుచేస్తాయి. కీరదోస డీహైడ్రేటింగ్ ఏజెంట్గా పనిచేస్తున్నది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండడంతో రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం కూడా. చెమటతో కోల్పోయిన నీటిని లవణాలను శరీరానికి అందించడంలో చక్కని పాత్ర పోషిస్తుంది. రోజూ కప్పు కీరదోస రసం తాగితే శరీరం నిగారింపు సంతరించుకుంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
కాలం ఏదైన అదే క్రేజీ..
ఏ కాలంలో అయినా అతి తక్కువ ధరకు లభించే కాయల్లో కీరదోస ఒకటి. వేసవితాపం నుంచి మనిషికి ఉపశమనం కలిగించడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తోపుడు బండ్లపై వీటిని ఎక్కువగా విక్రయిస్తుంటారు. కాయను కోసి కాస్త, ఉప్పు, కారం చల్లి తింటుంటే ఆ మజాయే వేరు. కిలోకు రూ.20 నుంచి రూ.30 మధ్య లభిస్తుంది. ఎక్కువగా శుభకార్యాలు, పెండ్లి సమయంలో కాస్త ధర ఎక్కువగా ఉంటుంది.
కీరదోసతో లాభాలు..