మక్తల్ టౌన్, ఏప్రిల్ 8 : తెలంగాణ ఆడబిడ్డలను సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నాడని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 110 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ తల్లిదండ్రులకు భారంకాకుండా ప్రతి ఆడబిడ్డలకు తండ్రిలాగా సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నాడని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోని చేయని అభివృద్ధి కార్యక్రమాలు సీఎం కేసీఆర్ చేపడుతున్నాడన్నారు. మరే ఇతర రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన పథకాలు తెలంగాణలో ప్రవేశపెడుతున్నారన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్గౌడ్, ఎంఆర్వో రాణాప్రతాప్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, పస్పుల సర్పంచ్ దత్తు, నాయకులు శేఖర్రెడ్డి, గోవర్ధ్దన్రెడ్డి, సర్పంచులు, మహిళలు తది తరులు పాల్గొన్నారు.
నర్వ, ఏప్రిల్ 8 : మండలంలోని సీపూర్ గ్రామానికి చెందిన 8 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, కొత్తపల్లి గ్రామానికి చెందిన హమీనాబేగానికి సీఎంఆర్ఎఫ్నుంచి మంజూరైన రూ.24వేల చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే చిట్టెం తన నివాసంలో అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్ద, ఏప్రిల్ 8 : కల్యాణలక్ష్మి చెక్కులను ముగ్గు రు లబ్ధిదారులకు ఎంపీపీ బక్క నర్సప్ప ఎంపీపీ కార్యాల యంలో శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో తాసిల్దా ర్ వెంకటేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అశోక్గౌడ్, నా యకులు భీంరెడ్డి, పుట్టి అంజి తదితరులు పాల్గొన్నారు.