శ్రీశైలం డిసెంబర్ 11 : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున మహా పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్నది. కార్తీకమాసం ఆఖరి సోమవారం పరమశివుడి దర్శనానికి ఉభయ తెలుగు రాష్ర్టాల నుంచే కాక ఉత్త ర దక్షిణాది యాత్రికులు కూడా అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు. తెల్లవారుజుమున కృష్ణానది లో పుణ్యస్నానాలు చేసి కృష్ణమ్మకు పసుపు, కుంకు మ, సారెలు ఇచ్చి కార్తీక దీప దానాలు చేస్తున్నారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించేందుకు ఆలయ ఉత్తర మాడవీధి, గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదే విధంగా భక్తులకు లడ్డూ ప్రసాదాలు అందేలా విక్రయ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీప కాంతులతో అలరారుతున్న ఆల య శోభను వీక్షిసూ భక్తులు ఆధ్యాత్మిక ఆనంద పరవశులవుతున్నారు.
శ్రీభ్రమరాంబ మల్లికార్జునుల ఉత్సవ మూర్తులకు శాస్ర్తోక్త పూజల అనంతరం పుష్కరిణి వద్దకు వేం చేయించి ప్రత్యేక పుప్పాలంకరణతో లక్ష దీపార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. కార్తీకమాసంలో పుష్కరిణి వద్ద మహిళలు దీపాలు వెలిగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మాసంలో ప్రతి సోమవారం పుష్కరిణి హారతి అత్యంత వైభవంగా జరిపించామన్నారు. ప్రత్యేక ఆకర్షణగా చేసే దశవిద హారతులను చూసేందుకు తెలంగాణ ప్రాంతాల వారు ఎక్కువగా ఆసక్తి చూపుతూ క్షేత్రానికి వస్తున్నారని శ్రీశైలప్రభ సంపాదకుడు డాక్టర్ అనిల్కుమార్ తెలిపారు.
దశవిధ హారతుల దర్శన ఫలం