కృష్ణానది సోయగాలు.. పక్షుల కిలకిలరావాలు.. జాలువారే జలపాతాలు.. గలగలపారే కాలువలు.. క్రూరమృగాల గాండ్రింపులు.. వన్యప్రాణుల సందళ్లు.. అబ్బురపరుస్తున్న శిలలు.. వ్యూ పాయింట్లు.. కట్టిపడేస్తున్న ప్రకృతి అందాలు.. ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు.. ఫారెస్ట్ గెస్ట్హౌస్లు.. నల్లమల సొంతం. వీటిని ప్రకృతి ప్రేమికుల చెంతకు తీసుకొచ్చేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో గత నెల 17న జంగల్ సఫారీని ప్రారంభించింది. ట్రెక్కింగ్, వసతితో ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేయడంతో ఆన్లైన్లో పలువురు పేర్లను నమోదు చేసుకున్నారు. రోజుకూ 12 మంది సందర్శకులకు అడవిలో పర్యటించే అవకాశాన్ని కల్పించింది. ఇప్పటికే డిసెంబర్ 1వ తేదీ వరకు 168 మంది తమ పేర్లను ముందుగానే నమోదు చేసుకున్నారు. వచ్చే సంక్రాంతి వరకు ఆన్లైన్ బుకింగ్ ఫుల్ అయింది. నల్లమలలో పర్యటించి మధురానుభూతి పొందేందుకు పలువురు ఉవ్విళ్లూరుతున్నారు.
అచ్చంపేట రూరల్, నవంబర్ 30:నల్లమల అటవీ అందాలు వర్ణించలేనివి. పక్షుల కిలకిలరావాలు.., జలపాతాలు.., జంతువుల ఉరుకులు.. పరుగులు.., ఆధ్యాత్మికత పంచే ఆలయాలు.., గలగల పారే కృష్ణానది.., సువిశాల అటవీ భాగం.., ఒళ్లు గగుర్లు పొడిచే లోయలు.., మలుపులు.., ప్రకృతి రమణీయత.., చెంచుల జీవన విధానం.. ప్రపంచంలో ఎక్కడా దొరకని వనమూలికలు.. ఇలా ఒక్కటేమిటీ అన్నీ నల్లమల సొంతం.. పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు నల్లమల అటవీ అందాలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. దేశంలోనే రెండో అతి పెద్దదైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ (ఏటీఆర్)లో నవంబర్ 17 నుంచి జంగల్ సఫారీ సేవలు ప్రారంభించారు. ఫారెస్ట్ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేశాయి. అటవీ ప్రాంతంలోని ఆలయాలు, జలపాతాలు వీక్షించేందుకు భక్తులు, పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. ఈ క్రమంలో ఏటీఆర్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎకో టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక శ్రద్ధ వహించింది. రెండు వాహనాలతో జంగల్ సఫారీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అమ్రాబాద్ ఎఫ్డీవో రోహిత్ గోపిడి తెలిపారు. బుధవారం వరకు 14 రోజులకుగానూ 168 మంది పర్యటించినట్లు చెప్పారు. సంక్రాంతి పండుగ వరకు ఆన్లైన్లో బుక్కింగ్ ఫుల్ అయ్యాయని పేర్కొన్నారు.
రద్దు చేసుకునే నిబంధనలు..
పర్యాటకుల నిబంధనలు..
ప్యాకేజీ ధరలు ఇలా..