జడ్చర్ల , డిసెంబర్ 19 : మున్సిపాలిటీలో 44వ జాతీయ రహదారిపై ఉన్న ఫ్లై ఓవర్ ప్రాంతాన్ని సోమవారం జ డ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు. జడ్చర్ల ైఫ్లై ఓవర్ నలుదిక్కుల నుంచి వాహనాల వస్తుండడం, వాహన రద్దీ ఎ క్కువగా ఉండడంతో ఫ్లై ఓవర్ దగ్గర ప్రతినిత్యం ట్రాఫిక్ జామవుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మున్సిపల్ చైర్మన్, ఎన్హెచ్ఏఐ అధికారులతో, పోలీసులతో కలిసి సోమవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ముఖ్యంగా భూత్పూర్ నుంచి జడ్చర్ల, బాదేపల్లి, వైపు వ చ్చే వాహనాలు సులువుగా వెళ్లే మార్గాన్ని వెడల్పు చేయ డం ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఇందుకు సంబందించిన త్వరగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీకి నియమితులైన నూతన పాలకవర్గా సభ్యులు సోమవారం జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్.సి.లక్ష్మారెడ్డిని కలిశారు. జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో మార్కెట్ చైర్మన్ మన్నెం గోవర్ధన్రెడ్డి, వైస్చైర్మన్ మహ్మద్ఆలీ దానిష్తోపాటు 12మంది డైరెక్టర్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్నానించారు. నూతనంగా నియమితులైన వారందరికీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అభినందనలు తెలిపారు.
జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సోమవారం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సందర్శించారు. క ళాశాలకు న్యాక్బృందం మార్చి మొదటి వారంలో వచ్చే అ వకాశం ఉండడంతో ఎమ్మెల్యే కళాశాలకు వచ్చారు. కళాశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కళాశాల ప్రిన్సిపాల్ అప్పియ చిన్నమ్మను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కళాశాలకు మార్చిలో న్యాక్ బృందం వచ్చే అవకాశం ఉందని అందుచేత కళాశాలలో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. కళాశాలకు విర్కో కంపెనీ వారు దాదాపు 30-40 లక్షల వ్యయంతో కళాశాలకు పేయింటింగ్ వేస్తున్నట్లు వివరించారు. కళాశాల అభివృద్ధికి అందరు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.