దోమలపెంట, డిసెంబర్ 11 : బీఆర్ఎస్ నేత నిర్మించుకున్న కట్టడం అక్రమమంటూ జేసీబీతో పంచాయతీ అధికారులు తొలగించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలోని బస్టాండ్ సమీపంలో 15 ఏండ్ల కిందట బీఆర్ఎస్ నేత, మాజీ ఉపసర్పంచ్ కటకం మహేశ్ షెడ్డు నిర్మించి టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అలాగే శ్రీశైలం రహదారి అనుసరించి ఏడాది కిందట మరో షెడ్ వేసి చాయ్, టిఫిన్ దుకాణం కొనసాగిస్తున్నాడు. అయితే నెల రోజుల కిందట పంచాయతీ అధికారులు రెండు నిర్మాణాలు ఆక్రమించి కట్టారని మహేశ్కు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించగా.. డిసెంబర్ 9వ తేదీ వరకు స్టే విధించింది. అయితే స్టే గడువు ముగియడంతో మున్సిపల్ అధికారులు బుధవారం తెల్లవారుజామున 5:30 గంటలకు రెండు నిర్మాణాలపై జేసీబీతో వెళ్లారు.
అయితే కోర్టులో కేసు ఉండగా ఎలా కూల్చివేస్తారని పోలీసులు, గ్రామ కార్యదర్శిని మహేశ్ నిలదీశాడు. బాధిత కుటుంబం కార్యదర్శితో వాగ్వాదానికి దిగారు. నిర్మాణాలు తొలగించవద్దని మహేశ్, కుటుంబ సభ్యు లు జేసీబీ అడ్డుపడి ప్రాధేయపడినా కార్యదర్శి, పోలీసులు వినిపించుకోలేదు. మహేశ్తోపాటు కుటుంబ స భ్యులను ఉదయం 6 గంటలకు ఈగలపెంట పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం కార్యదర్శి దగ్గరుండి.. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగించారు. తర్వాత వారిని విడుదల చేశారు. అనంతరం వారు అక్కడకు చేరుకొని నేలమట్టమైన నిర్మాణాలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పంచాయతీ కార్యదర్శి భీముడిని వివరణ కోరగా.. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారని, అందుకే ఉన్నతాధికారుల ఆ దేశాల మేరకు నోటీసులు ఇచ్చి అక్రమ నిర్మాణాలను తొలగించామని తెలిపారు. ప్రభుత్వ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
దయా దాక్షిణ్యం లేకుండా ఈడ్చిపడేస్తూ..
రాజకీయ కక్షతోనే.. : మహేశ్
దోమలపెంటలో అనేక నిర్మాణాలు అక్రమంగా నిర్మించారని, వాటిని తొలగించకుండా మా కట్టడాలు ఎందుకు కూల్చారని మహేశ్ నిలదీశాడు. కోర్టులో కేసు నడుస్తుండగా.. ఎలా కూల్చుతారని ప్రశ్నించారు. తా ను బీఆర్ఎస్ పార్టీలో చురుకుగా ఉండటంతో నే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కావాలనే.. కక్షగట్టి కూల్చివేయించారని ఆరోపించా రు. తొలగించాలంటే దోమలపెంటలో అనేక నిర్మాణలు ఉన్నాయని, వాటంన్నిటినీ కూల్చకుండానే తాను నిర్మించుకున్న కట్టడాలను కూల్చారని మహేశ్ మండిపడ్డాడు. తన హోటల్ నిర్మాణంపై కోర్టులో కేసు నడుస్తుండగా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. తాను ఎన్నో ఏండ్లుగా నివాసం ఉంటున్న ఇంటిని.. జీవనోపాధి కోసం పెట్టుకున్న హోటల్ను స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు కూల్చివేశారని ఆరోపించారు. గ్రామంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నా.. వీటిని కూ ల్చకుండా నా హోటల్ను మాత్రమే తొలగించడం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు. రాజకీయంగా నన్ను ఎ దుర్కోలేక.. కక్షగట్టి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. నన్ను, నా కుటుంబీకులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని వాపోయాడు.
Mahabubnagar2