గద్వాల రూరల్, మార్చి 19 : నడిగడ్డ ఇలవేల్పు జములమ్మను దర్శించుకోవడానికి మంగళవారం పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో జములమ్మ క్షేత్రం జనస్రందంగా మారింది. బైనోళ్ల శబ్దా లు, మహిళలు పూనకాలు, తల్లి కరుణించమ్మా అం టూ భక్తులు నినాదాలతో ఆలయ పరిసర ప్రాంతం మార్మోగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి జి ల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలో వేచి ఉన్నారు. ఆలయ గదులతోపాటు పరసరాల్లో టెంట్లు వేసుకుని నైవేద్యం వండుకొని అమ్మవారికి సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం కోసం రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దర్శనం తర్వాత భక్తులు సేదతీరేందుకు ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ చైర్పర్సన్ గాయత్రి, ఈవో ఫురేందర్ సిబ్బందితో కలిసి అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు జానకీరాములు, కాంబ్లే, అభిలాష్,శంకర్, ఆలయ సిబ్బంది మురళీధర్రెడ్డి, సంజీవరెడ్డి, రవిప్రకాశ్ పాల్గొన్నారు.