జడ్చర్లటౌన్, జనవరి12 : సమాజాభివృద్ధిలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. జడ్చర్లలోని ప్రేమ్రంగాగార్డెన్ ఫంక్షన్హాల్లో గురువారం జాతీయ సాహిత్యపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జానకీరామం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి పోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అనం తరం గద్వాల సీనియర్ సివిల్కోర్టు జడ్జి గుబ్బా ప్రభాకర్తో కలసి వి.జానకిరాములుగౌడ్ రచించిన జానకీరామం పుస్త కాన్ని ఆవిష్కరించి చిత్రకారిణి సంతోషికి చక్రవర్తుల వకుళా దేవి స్మారక పురస్కార అవార్డు అందజేశారు.
ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులు కీలకపాత్ర పోషించారన్నారు. సమా జంలో జరుగుతున్న స్థితిగతులను తెలియజేస్తూ ప్రజలను చైతన్యపర్చాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ప్రస్తుత సమాజంలో రాజకీయ విలువలు దిగజారిపోతున్నాయని, సోషల్మీడియాలోని పోస్టులు సత్యమో, అసత్యమో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు సోషల్మీడియాల్లో అసత్యపు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టించి అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్నాయన్నారు.
ఇలాంటి రాజకీయపార్టీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు మంచి చేసే ఏ ప్రభుత్వానైనా ఆదరించాలన్నారు. జానకీరామమ్ పుస్తకం సమాజం స్థితిగతులను చాటిచెప్పేలా ఉందన్నారు. కార్యక్ర మంలో జెడ్పీవైస్ చైర్మన్ యాదయ్య, సంగీత,నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, జాతీయ సాహిత్యపరిషత్ జిల్లా కార్యదర్శి ఉమ్మెంతల మహేశ్వర్, పుస్తక రచయిత జానకిరాములుగౌడ్, యలకంటి భాస్కర్, లక్ష్మీనారాయణ, పద్మలీలా, గోనెల రాధాకృష్ణ, కౌన్సిలర్లు, ముడా డైరక్టర్లు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.