లక్షా 20 వేల ఎకరాలకు సాగునీరు
మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి
మక్తల్ టౌన్, జూన్ 24 : నియోజకవర్గంలో సాగునీటికి ఇబ్బందులు రానీయమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రె డ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గోప్లాపూర్ వద్ద ఫేస్-1 నుంచి స్టేజ్-1 పంపును, అలాగే ఖానాపూర్ వద్ద ఉన్న స్టేజ్-2 పంపును ఎమ్మెల్యే ప్రారంభించ గా.. చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయర్కు నీటి ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గంలో లక్షా 20 వేల ఎకరాలకు సాగునీరు అం దుతుందని తెలిపారు.
నర్సిరెడ్డి రిజర్వాయర్ సామర్థ్యం 3.33 టీఎంసీలు అ న్నారు. భూత్పూరు రిజర్వాయర్ను కూ డా నింపుతామన్నారు. దీంతో మక్తల్, నర్వ, మాగనూరు, కృష్ణ, అమరచింత మండలాలకు సాగునీరు అందుతుందన్నారు. తాగు, సాగనీటి అవసరాల మేరకు నీటి విడుదల కొనసాగిస్తున్నామన్నారు. వర్షాకాలం ప్రారంభమైనా వర్షాలు కురవడం లేదని, కృష్ణానదికి వరద రాకున్నా రైతులను దృష్టిలో పెట్టుకొని నర్సిరెడ్డి రిజర్వాయర్ను నింపుతున్నామని తెలిపారు. స్టేజ్-1 పంప్ నుం చి రోజుకూ 600 క్యూసెక్కులు, స్టేజ్-2 పంప్ నుంచి 400 క్యూసెక్కులు విడుదల అవుతుందన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ సంజీవ్ ప్రసాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, ఏఈ నాగశివ, శేఖర్రెడ్డి పాల్గొన్నారు.