అలంపూర్, డిసెంబర్ 20 : రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును జోగుళాంబ ఆలయ పాలకమండలి సభ్యులు బుధవారం హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చిన్న కృష్ణయ్యనాయుడు, ఈవో పురేందర్కుమార్ ఆధ్వర్యంలో మంత్రులను వేర్వేరుగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువా కప్పి సన్మానించారు.
అదేవిధంగా ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం చేశారు. వసంత పంచమి రోజున అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుందని ఆ రోజు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకోవాలని మంత్రులను ఆహ్వానించారు. ముఖ్యంగా రాష్ట్రం లో గల ఏకైక శక్తి పీఠం అలంపూర్ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని మంత్రులను కోరారు. మంత్రులను కలిసిన వారిలో ఆలయ ముఖ్య అర్చకులు ఆనంద్శర్మతోపాటు ధర్మకర్తలు ఉన్నారు.