మహబూబ్నగర్, మార్చి 7 : నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మహబూబ్నగర్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచితంగా మూడు నెలలపాటు ఎలక్ట్రికల్ హౌస్వైరింగ్లో శిక్షణ ఇవ్వనున్నట్లు టీఆర్జీ అసిస్టెంట్ డైరెక్టర్ నిజలింగప్ప గురువారం ప్రకటనలో తెలిపారు.
పదో తరగతి చదివి 18నుంచి 35 ఏండ్లలోపు వారు శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో భోజనంతోపాటు వసతి కల్పిస్తామని, నేషనల్ స్కిల్ సర్టిఫికెట్ కూడా అందించడం జరుగుతుందన్నారు. వివరాలకు 9440410459 నెంబర్లో సంప్రదించాలన్నారు.