గద్వాల అర్బన్, జనవరి 19 : బినామీ రేషన్ డీలర్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులు క సరత్తు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ కలెక్టర్, అదనపు కలెక్టర్, పౌరసరఫరాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యం లో జోగుళాంబ గద్వాల జిల్లాలోని 335 రేషన్ షా పులను అధికారులు తనిఖీ చేయనున్నారు. 20వ తేదీలోగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి రేషన్ షాపు ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని పేర్కొన్నారు. రేషన్ షాపు బోర్డుపై పేరున్న వ్యక్తే దుకాణం నిర్వహిస్తున్నారా..? లేక వేరే వ్యక్తి నిర్వహిస్తున్నా రా..?, డీలర్ మృతి చెందిన చోట ఆయన కుటుంబ సభ్యులు కాకుండా వేరేవారెవరైనా నిర్వహిస్తున్నారా..? అనే అంశాల పై సర్వే చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లోని అధికారులు రేషన్ డీలర్లకు సం బంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు.
కొందరు రేషన్ డీలర్లు ఇతర పనులు చేసుకుంటుండగా, మరికొందరు పట్టణ ప్రాంతాల్లో ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. మహిళలకు ఉపాధి చూపించాలనే ఉద్దేశంతో జిల్లాలో అనేక మందికి డీలర్ షాపులు మంజూరు చేశారు. దుకాణాన్ని కేటాయించిన వారే ప్రజలకు నిత్యావసర సరుకులు విక్రయించాల్సి ఉండగా, ఎక్కడా మ హిళా డీలర్లు షాపుల్లో ఉంటున్న దాఖలాలు లేవు. అనేక గ్రామాల్లో యువతుల పేర్లపై రేషన్ షాపులు తీసుకున్నారు. వారు వివాహాలు చేసుకొని వెళ్లిపోవడంతో ఆయా షాపులను ఇతరులకు అప్పగించారు. అధికారులు నేరుగా రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి చూడడమే కాకుండా ప్రతినెలా రేషన్కు ఎవరు వ స్తున్నారు.? ఎవరు నడిపిస్తున్నారు.? ఈ-పాస్ యంత్రాల్లో ఎంత మంది వేలిముద్రలు మారా యి.? ఎవరి ఖాతాల్లోకి కమీషన్ డబ్బులు వెళ్తున్నా యి.? అనే అంశాలను పక్కాగా పరిశీలిస్తేనే బినామీలు ఎవరనేది తెలిసే అవకాశం ఉన్నది.
చౌకధరల దుకాణాల్లో రేషన్ ఇచ్చేందుకు డీలర్లతోపాటు వారి కుటుంబంలో మరో ఇద్దరికి మా త్రమే ఈ-పాస్ మిషన్లో తంబ్ వేసే అవకాశం క ల్పించారు. ఒకవేళ డీలర్ అందుబాటులో లేకుంటే ఆయన స్థానంలో వేలిముద్ర వేసి రేషన్ పంపిణీ చేసుకునే వెసులుబాటు కల్పించారు. కానీ, కొన్ని చోట్ల రేషన్ దుకాణాల బాధ్యతలను ఇన్చార్జీలకు అప్పగిస్తే.. వారు బినామీలకు ముట్టజెప్పారు. తాసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వేలిముద్రలు మార్చే అధికారం ఉంటుంది. దీంతో ఎవరికి కావాలంటే వారికి వేలిముద్రలు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తున్నది. బియ్యం పంపిణీ చేయడానికి ప్రభు త్వం క్వింటాకు రూ.140 చొప్పున డీలర్ల ఖాతాల్లో జమ చేస్తున్నది. ఇలా కొందరు బినామీ డీలర్లుగా అవతారం ఎత్తడమే కాకుండా వారి బ్యాంకు ఖాతాలను పౌరసరఫరాల శాఖ వద్ద నమోదు చేయించుకున్నారు. దీంతో ప్రభుత్వం నుంచి వచ్చే కమీషన్ నేరుగా బినామీల ఖాతాల్లోనే జమవుతున్నది. కాగా, అధికారులు తనిఖీలు చేస్తున్నారనే విషయం బయటకు పొక్కడంతో సదరు డీలర్లు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు పక్కాగా సర్వే చేయాల్సిన అవసరం ఉన్నది.
రేషన్ దుకాణాలపై త నిఖీలు నిర్వహించాలని ఇప్పటికే జిల్లా వ్యాప్తం గా అన్ని మండలాల తాసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశాం. బినామీ డీలర్లు ఉన్నట్లు గుర్తి స్తే అక్కడికక్కడే కే సులు నమోదు చే యాలని సూచించాం. వాస్తవ డీలర్ను సై తం తొలగించాలని ఆదేశించాం. 20వ తేదీలోగా సర్వే పూర్తి చేసి ప్రభుత్వాని కి నివేదికను సమర్పిస్తాం.