నాగర్కర్నూల్, డిసెంబర్ 22 : రైతులకు ఇబ్బందులు లేకుండా వరి, పత్తి కొనుగోలు చేయాలని కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారులను ఆదేశించారు. శు క్రవారం మండలంలోని గగ్గలపల్లి శ్రీకృష్ణ జిన్నింగ్ రైస్మిల్లును పరిశీలించి నెల్లికొండ వ్యవసాయ మా రెట్ యార్డ్లో వరి, పత్తి కొనుగోలు కేంద్రాలను ఆ కస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా శ్రీకృష్ణ జి న్నింగ్ పత్తిమిల్లులో పత్తి కొనుగోలుపై రైతులు, అధికారులతో మాట్లాడారు. పత్తి రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పత్తిని పండించే రైతులకు ఆ ధార్ను బ్యాంకు లింకేజీ చేసుకునేలా చూడాలన్నా రు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు క ల్పించాలన్నారు. పత్తిమిల్లులో పనిముట్ల పనితీరు, సదుపాయాలను చూడాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 2023-24 సంవత్సరానికి జిల్లాలో సాగుచేసిన పత్తి దిగుబడులను అంచనావేసి కనీస మద్దతు ధర రూ.7,020గా నిర్ణయించబడిందన్నారు.
జిల్లాలో 16 సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇప్పటి వరకు 501 మంది రైతులతో 18,224.17 మెట్రిక్ ట న్నుల పత్తిని కొనుగోలు చేసినట్లు వివరించారు. రూ.67లక్షల 51వేలను రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగిందని మారెటింగ్, సీసీఐ అధికారులు కలెక్టర్కు వివరించారు. అనంతరం నెల్లికొం డ వ్యవసాయ మారెట్ యార్డ్లో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేం ద్రాన్ని కలెక్టర్ పరిశీలించి కొనుగోలు ప్రక్రియను అ డిగి తెలుసుకున్నారు. జిల్లాలో సహకార సంఘం ఆ ధ్వర్యంలో 176 కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ ద్వా రా 24 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 4,063 మంది రైతులతో 26,991 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. రూ.15కోట్లు రైతుల ఖాతాల్లో జమ అ య్యేలా చూడడం జరిగిందన్నారు. డబ్బులు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నా రు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సీతారామారావు, మారెటింగ్ ఏడీ బాలామణి, సీసీఐ అధికారి ఫి రోజ్, డీసీవో పత్యనాయక్, డీఎస్వో స్వామికుమా ర్, సివిల్ సప్లయ్ డీఎం బాలరాజు పాల్గొన్నారు.
రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించాలి..
రెవెన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఉదయ్కుమార్ తాసీల్దార్లు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ధరణి, రిజిస్ట్రేషన్లు, భూసేకరణ, రెవెన్యూ సమస్యలు తదితర అంశాలపై కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. రెవెన్యూ సంబంధ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ధరణి, టీఎం-33 ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో పెండింగ్ ఉన్న వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని సూచించారు. జీఎల్ఎం సక్సేషన్, మ్యుటేషన్ల దరఖాస్తుల ఫైళ్లు వెంటనే అందించాలన్నారు. భూముల సర్వే, విచారణలు త్వరితగతిన పూర్తి చేసి అర్హులకు పట్టాల జారీకి చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పెండింగ్ దరఖాస్తులను పరిషరించాలన్నారు. కోర్టు కేసుల విషయంలో టైంబాండ్, డైరెక్షన్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ధరణి సమస్యలను తాసీల్దార్లు పరిష్కరించకుండా కలెక్టరేట్కు పంపించడంపై అసహనం వ్యక్తం చేశారు. పోలీస్ ఉద్యోగాల దరఖాస్తులో భాగంగా స్థానికత, కుల, ఆదాయ, ఇతరాత్ర ధ్రువపత్రాల జారీలో అలసత్వం ప్రదర్శించరాదని అధికారులను హెచ్చరించారు. అంతకుముందు ధరణి ఫిర్యాదుల పరిష్కారంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఏవో చంద్రశేఖర్, ఆర్డీవోలు రాంరెడ్డి, నరేశ్ పాల్గొన్నారు.
అధికారుల పనితీరు అభినందనీయం..
అసెంబ్లీ సాధారణ ఎన్నికలను విజయవంతం చేసిన అధికారుల పనితీరుపై కలెక్టర్ ఉదయ్కుమార్ హర్షం వ్యక్తం చేశారు. 2024లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలను కూడా చాలెంజ్గా తీసుకొని పనిచేయాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమీపంలోని వంశీ కన్వెన్షన్ గార్డెన్లో కలెక్టర్ అధికారులకు గెట్ టు గెదర్ సమావేశం నిర్వహించి ఎన్నికల విజయోత్సవ సభను నిర్వహించారు. రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి అభినందనలు తెలిపారు. సమావేశంలో ఎస్పీ వైభవ్ గైక్వాడ్, అదనపు కలెక్టర్లు కుమార్దీపక్, సీతారామారావు, ఏవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.