భూత్పూర్, ఆగస్టు 19 : బీఆర్ఎస్ హయాంలోనే ఆలయాలకు మహర్దశ చేకూరిందని దేవాదాయశా ఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అన్నాసాగర్ ఆలయంలో ప్రతిష్ఠించిన గణపతి, శివలింగం, అమ్మవారు, ఆంజనేయస్వామి విగ్రహాలు, నవగ్రహాలకు మంత్రి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలయాలకు పునర్వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ధూపదీప నైవేద్యం పథకాన్ని ప్రారంభించారన్నారు. ఈ పథకం వల్ల అర్చకులకు జీవనోపాధి మెరుగవుతుందన్నారు.
మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్రెడ్డి, అబ్రహం, అంజయ్యయాదవ్కు ఆల య కమిటీ, అర్చకులు కలశాలతో స్వాగతం పలికారు. కా ర్యక్రమంలో పురావస్తుశాఖ డైరెక్టర్ శివనాగిరెడ్డి, మున్సిప ల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్, ఎంపీపీ, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.