మూసాపేట, అక్టోబర్ 8 : కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ తక్కువ సమయంలో ఊహించని అభివృద్ధి చేశారని, దీంతో ప్రజలంతా బీఆర్ఎస్వైపే ఉన్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం మూసాపేట మండల కేంద్రంతోపాటు జానంపేట, తాళ్లగడ్డ, పోల్కంపల్లి, అచ్చాయిపల్లి, నందిపేట, వేముల తదితర గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శం కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యేకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. జానంపేటలో యాదవ సంఘం వద్ద ఎమ్మెల్యేకు గొంగడితో సన్మానించి, గొర్రె పిల్లను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే జానంపేట జాతీయ రహదారి నుంచి తాళ్లగడ్డకు రూ.2.50కోట్లతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అచ్చాయిపల్లిలో రూ.20లక్షలతో నూతన గ్రామ పంచాయతీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కనకాపూర్ తండా వరకు బీటీ రోడ్డు వేయాలని గ్రామస్తులు కోరారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందించి త్వరలోనే రోడ్డు వేసుకుందామని చెప్పారు. జానంపేటలో రూ.20లక్షల నిధులతో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి, రూ.12లక్షలతో యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, రూ.10 లక్షలతో వాల్మీకి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. డబుల్బెడ్రూం ఇండ్ల వద్ద రూ.29లక్షలతో నిర్మించిన తాగునీటి సంపును ప్రారంభించారు. పోల్కంపల్లిలో రూ.20లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఏడు మంది లబ్ధిదారులకు రూ.6,93,500ల సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. కొమిరెడ్డిపల్లికి చెందిన ధర్మారెడ్డికి రూ.3లక్షల చెక్కును అందజేశారు. అలాగే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమా న్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. జానంపేట కాంగ్రెస్ పా ర్టీకి చెందిన వడ్ల నారాయణ ఎమ్మెల్యే సమక్ష్యంలో బీ ఆర్ఎస్లో చేరారు. నందిపేట, వేముల, కొత్తపేట ప లు అభివృద్ధి లు, శంకుస్థాపనలు, ముసాపేటలో తిరుపతయ్య, ఖాదర్తోపాటు 40 మంది బీఆర్ఎస్లో చేరారు. 80 డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్ఈ పుల్లారెడ్డి, ఎంపీడీవో స్వరూప, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ కళావతి, వైస్ ఎంపీపీ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్, సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు భాస్కర్గౌడ్, సర్పంచులు శ్రీకాంత్రెడ్డి, అరుణ, చంద్రశేఖర్, శ్రీనివాసులు, శేఖర్, ఎంపీటీసీలు అంజనేయులు, సుకన్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.