మహబూబ్నగర్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమా కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భూత్పుర్ మండల బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు చింతలపల్లి బాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏర్వ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు, సుమారు 300 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సరైన గౌరవం ఉంటుందన్నారు. పార్టీ కార్యకర్తలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.