గద్వాల, అక్టోబర్ 3 : ‘సాధారణంగా గర్భిణికి సీమంతం చేయడానికి తల్లిగారింటికి తీసుకెళ్తారు.. కానీ చాలామంది పేదవాళ్లు తమ కూ తుళ్లకు ఈ కార్యం చేయరు.. గద్వాల నియోజకవర్గంలో ఉన్న గర్భిణులకు ఓ అన్నగా సీ మంతం చేయడం నాతోపాటు నాభార్య జన్మ ధన్యమైంది’ అని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, ఆయన సతీమణి జ్యోతి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కా ర్యాలయంలో 500 మంది గర్భిణులకు సీ మంతం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో సరైన వైద్యం అందక గ్రా మాల్లో నివసించే గర్భిణులు నానా అవస్థలు పడేవారని గుర్తు చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అ మ్మాయి పుట్టినప్పుడు కేసీఆర్ కిట్తో మొదలై చదువు కోసం గురుకులాలు, పెండ్లికి షాదీ ము బారక్, గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు న్యూట్రిషన్ కిట్ ఇలా ఎ న్నో సదుపాయాలను సీఎం కేసీఆర్ అందుబాటులో ఉంచారన్నారు. గర్భిణులకు సీమంతం చేస్తున్నందుకు ఓ అన్నగా గర్వపడుతున్నారు. మహిళా భద్రత కోసం ప్రభుత్వం షీటీం ఏర్పాటు చేసిందన్నారు.
గతంలో ప్రభుత్వ దవాఖానలపై నమ్మకం లేక ప్రైవేట్ దవాఖానకు వెళ్లి డబ్బు ఖర్చు చేసేవారని, నేడు సర్కారు దవాఖానల్లోనే 80 శా తానికి పైగా ప్రసవాలు జరుగుతున్నాయని, అందుకు ప్రభుత్వం సమకూర్చిన సౌకర్యాలే కారణమని వివరించారు. ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఎమ్మెల్యే సతీమణి జ్యోతి తెలిపారు. ఇటీవల కేంద్రం మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించడం హ ర్షణీయమన్నారు. మహిళలు ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్నాయుడు, మహిళా నాయకురాళ్లు రాధ, రా ధమ్మ, ఇందిరమ్మ, అంగన్వాటీచర్లు తదితరులు పాల్గొన్నారు.