నవాబ్పేట, డిసెంబర్ 2 : ఉపాధి హామీ పథకంలో భా గంగా వివిధ గ్రామాల్లో నిర్మించుకున్న ఇంకుడుగుంతల బి ల్లులు ఏమయ్యామని సర్వసభ్య సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ అనంతయ్య అధ్యక్షతన శుక్రవారం స ర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం తీరును ఏపీవో జ్యోతి, ఈసీ ప్రశాంత్రెడ్డి వివరిస్తుండగా ప లువురు సభ్యులు స్పందిస్తూ… నాలుగైదేండ్ల కిందట నిర్మించుకున్న ఇంకుడుగుంతలకు నేటికీ బిల్లులు రాలేవని వైస్ ఎంపీపీ సంతోష్రెడ్డి, సర్పంచులు సత్యం, వెంకటేశ్, యాద య్య తదితరులు ప్రశ్నించారు.
పనులు చేయించిన వారికి కే వలం సగం డబ్బులు మాత్రమే ఇచ్చారని, మిగతా డబ్బులు ఏమయ్యాయని నిలదీశారు. వాటి వివరాలు తెలపాలని స భలో పట్టుబట్టారు. వివిధ విడుతల్లో హరితహారంలో ప్రతి ఏడాది రోడ్లు, గట్లు, ప్రభుత్వ భూముల్లో లక్షలకొద్దీ మొక్క లు నాటుతున్నారని.. కానీ అవి సగానికి పైగా ఎండిపోతున్నాయన్నారు. రికార్డుల్లో కాకుండా క్షేత్రస్థాయిలో మొక్కలు చూపాలని సూచించారు. వ్యవసాయ శాఖ పనితీరును ఏ ఈవో శ్వేత వివరిస్తుండగా..పలువురు సభ్యులు ఆక్షేపించా రు. ఏఈవోలు గ్రామాల్లో సరిగా పర్యటించడం లేదని, రైతులకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండడం లేదని సర్పంచ్ సత్యం, వైస్ఎంపీపీ సంతోష్రెడ్డి నిలదీశారు.
వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల మండలంలో 3 వేల మంది రైతులకు పీఎం కిసాన్ డబ్బులు రాలేదన్నారు. ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లోను ఏఈవోలు అందుబాటులో ఉండడం లేదన్నారు. పంచాయతీరాజ్ శాఖ పనితీరును ఎంపీవో భద్రునాయక్ వివరిస్తుండగా పలువురు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామా ల్లో అర్హులైన వారు ఉన్నా ఆసరా పింఛ న్లు ఎందుకు రాలేదని నిలదీశారు. క్షేత్రస్థాయిలో కార్యదర్శులు చేసిన పొరపా ట్ల వల్ల నిజమైన లబ్ధిదారులకు రావడం లేదని.. అలాంటి వారిపై చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేస్తామని జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, ఎంపీపీ అనంతయ్య, సర్పంచులు గోపాల్గౌడ్, సత్యం సభలో పేర్కొన్నారు.
గ్రామీణ తాగునీటి సరఫరాపై ఏఈ షమీయుల్లా మాట్లాడుతుండగా పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశా రు. ప్రభుత్వం కోట్లు వెచ్చించి గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందిస్తున్నా అధికారుల ఆలసత్వంతో అందడం లేదని దేపల్లి సర్పంచ్ లత, తిమ్మయ్యపల్లి సర్పంచ్ యాదమ్మ, కొ ల్లూరు ఎంపీటీసీ తుల్సీరామ్నాయక్ వాపోయారు. సత్రోనిపల్లితండాలో నేటికీ వాటర్ట్యాంకు నిర్మాణం పూర్తి కాలేదన్నారు. వైద్య ఆరోగ్యశాఖ పనితీరును డాక్టర్ విజయలక్ష్మి వి వరిస్తుండగా వైస్ఎంపీపీ సంతోష్రెడ్డి, చెన్నారెడ్డిపల్లి సర్పం చ్ యాదయ్య, చౌడూర్ సర్పంచ్ వెంటకయ్య తదితరు లు స్పందించారు.
వివిధ గ్రామాల సర్పంచులు యాదయ్య, గోపాల్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్ మాట్లాడుతూ ఎనిమిది నెలల కింద సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేసినా నేటికీ బిల్లులు రావడం లే దని వాపోయారు. అనంతరం విద్య, ట్రాన్స్కో, ఐకేపీ, రెవె న్యూ, ఐసీడీఎస్, ఎక్సైజ్, ఆర్టీసీ శాఖల పనితీరుపై చర్చ జరిగింది. కార్యక్రమంలో జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ నర్సింహులు, మార్కెట్ చైర్మన్ లక్ష్మయ్య, తాసిల్దార్ రాజేందర్రెడ్డి, ఎంపీడీవో శ్రీలత, రైతుబంధు మండల కోఆర్డినేటర్ మధుసూదన్రెడ్డి, కోఆప్షన్ స భ్యుడు తాహెర్ తదితరులు పాల్గొన్నారు.