కడ్తాల్, డిసెంబర్ 31 : ధ్యానమయ ప్రపం చ నిర్మాణంతోపాటు, ప్రతి వ్యక్తి జ్ఞాన యోగి కావాలన్నదే సుభాశ్ పత్రీజీ సంకల్పమని పరిణిత పత్రీ, ట్రస్టు చైర్మన్ కోర్పోలు విజయభాస్కర్రెడ్డి అన్నారు. మండలకేంద్రం సమీపంలోని కైలాసాపురిలోని మహేశ్వర మహా పిరమిడ్లో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగా లు ఆదివారం ముగిశాయి. చివరి రోజు ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహించిన ప్రాతఃకాల ధ్యానంలో వివిధ ప్రాంతా ల నుంచి వచ్చిన ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యానులద్ధేశించి పరిణిత పత్రీ మాట్లాడుతూ నిత్యం ధ్యాన సాధనతో మనస్సు ప్రశాంతాంగ ఉండటంతోపాటు ఆనందమయ జీవితాన్ని గడపవచ్చని తెలిపా రు. ప్రతి ధ్యాని పత్రీజీ చూపిన ధ్యాన మార్గం లో నడిచి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ధ్యానులు 18 ఆదర్శ సూత్రా లు పాటించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఎలాంటి కష్ట సమయంలోనైనా ధ్యా నం గుర్తుకొచ్చిన మరుక్షణం, మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలిపారు. 2024 డిసెంబర్లో నిర్వహించే సభలకు ‘పత్రీజీ మహిళ ధాన్య మహా యాగం’గా నామకరణం చేసినట్లు వివరించారు. అనంతరం పిరమిడ్ ప్రధాన వేదికపై ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, పరిమళ పత్రీ, పరిణిత పత్రీ, ట్రస్టు సభ్యులను ఘనంగా సన్మానించారు. అంతకుముందు ధ్యాన వేదికపై ప్రముఖ సింగర్ శ్రీలలిత ఆలపించిన పాటలు, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నా యి. కార్యక్రమంలో సభ్యులు సాంబశివరావు, హన్మంతురాజు, బాలకృష్ణ, లక్ష్మి, శ్రీరామ్గోపాల్, మాధవి, జయశ్రీ, సౌమ్యకృష్ణ, దామోదర్రెడ్డి, శివప్రసాద్, మాధవి, రాంబాబు, శివప్రసాద్, చంద్రశేఖర్, కేశవరాజు, భారతి, సునీత, సురేశ్, రవికుమార్, పీఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు నవకాంత్, ఆనంద్, ధ్యానులు పాల్గొన్నారు.