జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 23 : వినాయక ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జడ్చర్లలో నిర్వహించిన వినాయక నిమజ్జనోత్సవ వేడుకలో జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మొదటగా నేతాజీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద గుండప్పకంపౌండ్ గణనాథుడికి పూలమాల వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన అష్టదిగ్భంధనం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పూజలు చేశారు. అదే విధంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద గణనాథులను స్వాగతం పలికారు. నాగసాల గ్రామ శివారులోని చెరువు వద్ద ఏర్పాటు చేసిన క్రేన్పై ఎక్కి వినాయక వి గ్రహాం నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయ క నిమజ్జన ఉత్సవాన్ని భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీ వైస్చైర్మన్ యాద య్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, ఎస్పీ నర్సింహ, డీఎస్పీ మహేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, కౌన్సిలర్లు, ముడాడైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
గంగమ్మ ఒడికి గణనాథుడు
బాలానగర్, సెప్టెంబర్ 23 : మండల కేంద్రంలోని అయ్యప్పకాలనీలో ప్రతిష్ఠించిన బాలగణేశ్ మండపం వద్ద స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన ఉపేందర్, దత్తాత్రేయ్య భక్తులకు అన్నదానం చేశారు. అలాగే లడ్డూ వే లం నిర్వహించారు. అదేవిధంగా పెద్దరేవల్లిలో యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడి మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశా రు. కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ వెంకటాచారి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాసరావు, మండల ప్రధా న కార్యదర్శి చెన్నారెడ్డి, సర్పంచ్ శంకర్ ఉన్నారు.
మూసాపేట(అడ్డాకుల), సెప్టెంబర్ 23 : అడ్డాకుల మండల కేంద్రంతోపాటు, కందూరు, తిమ్మాయిపల్లి తదితర గ్రామాల్లో, మూసాపేట మండల కేంద్రంతోపాటు, సంకలమద్ది తదితర గ్రామాల్లో శనివారం వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాలు వైభవంగా సాగాయి. ఆయా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో వినాయక విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేసి, భజా భజంత్రీలతో ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేశారు.
హన్వాడ, సెప్టెంబర్ 23 : మండలంలోని చిన్నదర్పల్లి, టంకర, హన్వాడ గ్రామాల్లో వినాయకులను ఆయా గ్రామాల్లోని చెరువులో నిమజ్జనం చేశారు. నిమజ్జనం వద్ద ఎలాంటి ఘటనలు జరుగకూడ పోలీసులు చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మిడ్జిల్, సెప్టెంబర్ 23 : శనివారం రాత్రి గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరారు. మిడ్జిల్ మండల కేంద్రంతోపాటు బోయిన్పల్లి, వేముల, కొత్తపల్లి, చిల్వేర్, రాణిపేట, వాడ్యాల్ తదితర గ్రామాల్లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన వినాయకుల వద్ద అన్నదానం చేశారు. అనంతరం డప్పుచప్పుళ్ల, బ్యాండ్, పాటలతో యువతీయుకులు, చిన్నారులు నృత్యాలు చేస్తూ గణేశులను నిమజ్జనానికి తరలించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
భూత్పూర్, సెప్టెంబర్ 23 : శనివారం మద్దిగట్లలో లడ్డూ వేలం రూ.1,29,116లకు బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కుప్పిరెడ్డి నర్సింహారెడ్డి దక్కించుకున్నారు. అనంతరం ఆట-పాటలతో వినాయకులకు నిమజ్జన వేడుకలను నిర్వహించారు. ఎస్సై శ్రీనివాసు లు వినాయక నిమజ్జనాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
జడ్చర్ల, సెప్టెంబర్ 23 : జడ్చర్ల మండలం దేవునిగుట్టతండాలో శనివారం వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డూవేలంలో వినాయకుడి లడ్డూ రూ.35,800 ధర పలికింది. ఈ లడ్డూను తండాకు చెందిన పద్మాదేవేందర్ అనే దంపతులు దక్కించుకున్నారు. మరో లడ్డూను లలితా రాంలాల్ అనే దంపతులు రూ.30వేలకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాములునాయక్, బాబునాయక్, యువకులు పాల్గొన్నారు.
రాజాపూర్, సెప్టెంబర్ 23 : మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గణపతికి రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదానం చేశారు. అలాగే తిర్మలాపూర్లోని శివాలయంలో ఏర్పాటు చేసిన గణపతికి పూజలు నిర్వహించి గ్రామంలోని చెరువులో నిమజ్జనం చేశారు.