మాగనూరు : అక్రమ ఇసుక ( Illegal sand ) దందాకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. అధికారులు పట్టుకున్న గంటల్లోనే రాత్రి వేళ్లల్లో ఇసుకు మాయం అవుతుంది. కృష్ణా పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడుమాల్ ( Mudumaal ) గ్రామంలో అధికారులు ఇసుక డంపులు పగలు సీజ్ చేస్తే రాత్రికి రాత్రి అక్రమార్కులు టిప్పర్ల ద్వారా తరలిస్తు మాయం చేస్తున్నారు.
మూడుమల్ గ్రామస్తుల వివరాల మేరకు నిత్యం రాత్రి వేళలో కృష్ణానదిలో హిటాచీలు ద్వారా ఇసుక తవ్వకాలు జరిపి టిప్పర్ల ద్వారా పెద్ద మొత్తంలో డంపులు చేస్తున్న సమాచారం సంబంధిత రెవెన్యూ, పోలీస్ సిబ్బందికి ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. ఇసుక డంపుల గురించి మంగళవారం మైనింగ్ ఆర్ఐ ప్రతాపరెడ్డి జిల్లా అధికారులకు సమాచారం అందించడంతో విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు కృష్ణా మండలం వాసునగర్ మూడుమాల్ గ్రామానికి చేరుకొని పెద్ద మొత్తంలో ఇసుక డంపులు గుర్తించారు.

దాదాపు 30 ట్రిప్పర్లకు పైగా ఇసుక డంపులు గుర్తించి కృష్ణ మండల రెవెన్యూ సిబ్బంది సమక్షంలో మైనింగ్ ఆర్ ఐ ప్రతాప్ రెడ్డి సీజ్ చేశారు. అయితే వాసునగర్లో కూడా ఇసుక డంపులను సీజ్ చేయాల్సి ఉండగా వాటిని వదిలేశారు. అయితే మూడుమాల్లో సీజ్ చేసిన ఇసుకను ట్రిప్పర్ల ద్వారా ఇస్కాసురులు రాత్రికి రాత్రి మాయం చేశారు.
ఇసుక గుండెబల్లూరు టైరోడ్ హిందూపూర్ మీదుగా కర్ణాటకకు ఇసుక తరలించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అక్రమంగా ఇసుక తరలించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ ఇసుక రవాణా జరుగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.