మహబూబ్నగర్ టౌన్, జనవరి 4 : పాలమూరు విశ్వవిద్యాలయంలో హరితహారం కార్యక్రమం నిర్వహించి పెద్దఎత్తున మొక్కలు నాటుతామని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అ న్నారు. మంగళవారం పట్టణంలో అధికారులతో కలిసి యూనివర్సిటీ లో వాక్ నిర్వహించి పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఇదివరకే నిర్ణయించిన ట్లు తెలిపారు. విశ్వవిద్యాలయం లో సంవద వనాలు, బృహత్ పట్ట ణ వనం పార్కుల ఏర్పాటు ఇతర ఖాళీ స్థలాల్లో మొక్క ల పెంపకం, ఉద్యాన తోటలు చేపట్టేందుకు స్థలాలను గుర్తించామ ని పేర్కొన్నారు. యూ నివర్సిటీలో తోతట్టు ప్రాంతాలు పరిశీలించి అక్కడ నీటి నిల్వ ఉం చేందుకు గల అవకాశాలను పరిశీలించాలన్నారు. నాటిన మొక్కల మధ్య దూ రం తగ్గించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూ చించారు. మొక్కలకు నిరంతరం నీటిని సరఫరా చేసేందు కు ఉన్న అవకాశాలను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమం లో పీయూ వీసీ డాక్టర్ లక్ష్మీకాంత్రాథోడ్, అదనపు కలెక్టర్ తేజస్నంద్లాల్పవార్, రిజిస్ట్రార్ పిండి పవన్కుమార్, వోఎస్డీ మధుసూదన్రెడ్డి, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటరమ ణ, డీఎఫ్వో గంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమా ర్, భగీరథ ఈఈ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.