శ్రీశైలం, ఆగస్టు 12 : శ్రీశైలం జలాశయానికి వరద భారీగా వచ్చి చేరుతున్నది. క్యూసెక్కుల నీటి ఇన్ఫ్లో వస్తుండడంతో రెండు రోజులుగా డ్యాం పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి 2,14,994, విద్యుదుత్పత్తి ద్వారా 28,034, సుంకేశుల డ్యాం నుంచి 1,52,262 క్యూసెక్కులు (మొత్తం 3,94,290 క్యూసెక్కులు) నీరు శ్రీశైలానికి విడుదల కాగా శుక్రవారం సాయంత్రానికి 4,55,382 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. స్పిల్వే గేట్ల నుంచి 3,77,650 క్యూసెక్కులు, కుడి, ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి 62,044 క్యూసెక్కులు సాగర్కు విడుదల చేశారు. రిజర్వాయర్ నీటిమట్టం 885 అడుగులకుగానూ 884.60 అడుగులకు చేరగా.. సామర్థ్యం 215.80 టీఎంసీలకుగానూ 213.40 టీఎంసీలుగా నమోదైంది.
జూరాలకు వరద..
అమరచింత, ఆగస్టు 12 : ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టు లో వరద వచ్చి చేరుతున్నది. శుక్రవారం సాయంత్రానికి 2.52 లక్షల క్యూసెక్కులు ఇన్ఫ్లో నమోదు కాగా విద్యుదుతృత్తి కోసం 27,943 క్యూసెక్కులు వినియోగించినట్లు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీ లు కాగా ఎడుమ కాల్వకు 640 క్యూసెక్కులు, కుడి కాల్వకు 442 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో 38 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 2,44,213 క్యూసెక్కులు అవుట్ఫ్లోగా నమోదైనట్లు చెప్పారు.
టీబీ డ్యాంకు 33 గేట్ల నుంచి వరద..
అయిజ, ఆగస్టు 12 : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు 33 గేట్ల నుంచి వరదను విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఇన్ఫ్లో 1,23,192 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,00,014 క్యూసెక్కులుగా నమోదైనట్లు డ్యాం ఎస్ఈ శ్రీకాంత్రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. సామర్థ్యం 105.788 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 102.014 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నీటిమట్టం 1633 అడుగులకుగానూ ప్రస్తుతం 1632.06 అడుగులకు చేరినట్లు పేర్కొన్నారు. అలాగే కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద వచ్చి చేరుతున్నది. ఇన్ఫ్లో 1,40,200 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ఫ్లో 1,39,800 క్యూసెక్కులుగా నమోదైంది. ఆయకట్టుకు 400 క్యూసెక్కులు విడుదల చేసినట్లు ఆర్డీఎస్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 14.1 అడుగుల నీటిమట్టం నిల్వ ఉన్నట్లు తెలిపారు.
సుంకేశులకు ఇన్ఫ్లో..
రాజోళి, ఆగస్టు 12 : సుంకేశుల జలాశయానికి ఎగువ నుంచి ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని డ్యాం జేఈ రాజు తెలిపారు. శుక్రవారం ఎగువ నుంచి 1,62,433 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. 27 గేట్లు తెరిచి 1,60,338 క్యూసెక్కులు దిగువన ఉన్న శ్రీశైలానికి విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కేసీ కెనాల్కు 2,095 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.