కొత్తకోట, జనవరి 30 : మధ్యప్రదేశ్ రా ష్ట్రంలోని భోపాల్లో పండిట్ సుందర్లాల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1,2వ తేదీ ల్లో నిర్వహిస్తున్న జాతీయ విద్యావేత్తల సదస్సుకు మండలంలోని రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం మురళీకృష్ణ ఎంపికయ్యారు.
ఈ సదస్సులో మురళీకృష్ణ వెదురుతో చేసిన బొమ్మలు, బోధనోపకరణాలు, ఆటలను పాఠశాల స్థాయిలో ఏ విధంగా ప్రవేశపెట్టి విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలి అనే అంశంపై పరిశోధనా పత్రా న్ని అందజేయనున్నారు. ఈ సదస్సుకు ఎంపికైనందున కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఈవో గోవిందరాజులు హెచ్ఎం మురళీకృష్ణను అభినందించారు.