మద్దూర్, డిసెంబర్ 7 : పంట మార్పిడితో నేల సారవం తం పెరుగుతున్నదని కలెక్టర్ హరిచందన అన్నారు. మండ లకేంద్రంలోని రైతు వేదికలో మండల వ్యవసాయ శాఖ ఆ ధ్వర్యంలో యాసంగి పంటలపై మంగళవారం రైతులకు అ వగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడుతూ యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలపై దృష్టి సారించాలని పేర్కొన్నా రు. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరి పంటను కొనుగో లు చేయకపోవడం వల్ల కేంద్రాలు ఉండే పరిస్థితి లేదన్నా రు. వరి సాగుకు బదులుగా వాణిజ్య పంటలు, పండ్ల తోట లు, కూరగాయల సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, ఏవో ఉదయకాంత్, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, ఏఈవోలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇతర పంటలు సాగు చేయాలి
యాసంగిలో రైతులు ఇతర పంటలు వేసుకోవాలని కలెక్టర్ హరిచందన అన్నారు. మం డలంలోని లోకుర్తి రైతు వేదికలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు ఆమె హాజరై మాట్లాడుతూ రైతులు యా సంగిలో వరి పంటకు బదులుగా ఇతర పంటలు పండించాలని పేర్కొన్నారు. యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు కాబట్టి రైతులు గమనించి చిరుధాన్యాలు, కూరగాయలు, శనగ, వేరశనగ, పొద్దు తిరుగుడు, తెల్ల కుసుమలు, నువ్వులు, పెసర, ఆముదాలు, ధనియాలు తదితర పంట లు పండించుకోవాలన్నారు. ఆయుర్వేద మొక్కలు పెంచడంతో రైతులకు మంచి ఆదాయం పొందవచ్చునన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి జాన్ సుధాకర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ భాస్కరాకుమారి, ఎంపీపీ బక్క నర్సప్ప, వివిధ గ్రామాల విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వాణిజ్య పంటలు సాగు చేయాలి
యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు వేసుకోవాలని మండల వ్యవసాయాధికారి సుదర్శన్గౌడ్ అన్నారు. మండలంలోని గుడెబల్లూర్, గురుజా ల, ఆలంపల్లి తదితర గ్రామాల్లో మంగళవారం యాసంగి సాగు పంటల ప్రణాళికపై ఏఈవో ఆధ్వర్యంలో రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో వరి పంటకు బదులు గా నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమ, పప్పు దినుసులైన కంది, పెసర వంటి పంటలను వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు రామకృష్ణరావు, మహదేవ మ్మ, ఎంపీటీసీలు వెంకటేశ్, లక్ష్మీనారాయణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
లాభాలు వచ్చే పంటలు వేయాలి
పంటల మార్పిడితో రైతులకు అధిక లాభాలు వస్తాయని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వెంకటేశ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సూరారం, మల్కపూర్, లింగాల్చేడ్, వీరంపల్లి, కో యిల్కొండ తదితర గ్రామాల్లో పంటల మార్పిడిపై రైతుల కు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మా ట్లాడుతూ వరికి బదులుగా రైతులు ఇతర పంటలు వేసుకోవడంతో అధిక దిగుబడితోపాటు లాభాలు వస్తాయన్నారు. రైతులు పంట మార్పిడిపై ప్రత్యేక దృష్టి సారించాలని కో రారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.