ప్రభుత్వ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి
రైతుల అభివృద్ధే సర్కార్ ధ్యేయం
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
సబ్సిడీ కింద కూరగాయల మొక్కలు పంపిణీ
పెద్దమందడి, జూన్ 26: ప్రభుత్వం సబ్సిడీని రైతు లు సద్వినియోగం చేసుకొని పంటలు సాగుచేసి అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దమంద డి మండలంలోని చిన్నమందడి గ్రామంలో 80శాతం సబ్సిడీ కింద మంజూరైన కూరగాయల మొక్కలను రై తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల పక్షాన ఉంటూ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. అందులో రైతు పెట్టుబడి సాయం కింద రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సాగునీరు, ఎ రువులు, విత్తనాలు, సబ్సిడీ యంత్రాలు తదితర వాటి ని అందజేస్తున్నారన్నారు. రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రైతులు ఒకే పంటపై ఆధారపడకుం డా పంటమార్పిడి పద్ధతిని అవలంబిస్తే దిగుబడి పెరుగుతుందన్నారు. రైతులు ఆధునికతను దృష్టిలో ఉంచుకొని పంటలు సాగుచేసి ఆర్థికంగా ఎదగాలన్నారు. కా ర్యక్రమంలో సర్పంచ్ సూర్యచంద్రారెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్యాదవ్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా డైరెక్టర్ నాగేంద్రంయాదవ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు బాలరాజు, నాయకుడు నరేశ్ పాల్గొన్నారు.
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి..
వనపర్తి టౌన్, జూన్ 26 : సాంకేతికతను అందిపుచ్చుకొని స్వయంశక్తితో ఎదగాలని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని వరదరాజు కాంప్లెక్స్లో డిజిటల్ ఎడ్యుకేషన్ హబ్ ఆధ్వర్యం లో నిర్వహించిన శిక్షణ, అవగాహన తరగతులకు ఆయ న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజ్ఞాన రంగంలో కొంత పుంతలు తొక్కుతున్న క్రమంలో సాంకేతిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులు, యువత, మహిళలు ఇంటర్నెట్, డ్యాకుమెంట్లు రూపొందించడం, పవర్ పాయింట్ ప్ర జంటేషన్ చేయడం తదితర అంశాలను నేర్చుకొని స్వయంశక్తితో ఎదగాలని సూచించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో సమ్మర్ క్యాంపులో 200 మంది విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకున్నారని వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. మంత్రి వారితో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిటల్ ఎడ్యుకేషన్ హబ్ నిర్వాహకులు బిక్కుమల్ల శ్రీనివాసులు మా ట్లాడుతూ విద్యావంతులైనప్పటికీ టెక్నికల్ జ్ఞానాన్ని పంచుకొని ఉన్నతంగా రాణించేందుకు డీహబ్ను ఏ ర్పాటు చేశామని, ఇప్పటివరకు వెయ్యిమందికిపైగా జ్ఞానాన్ని నేర్పుతున్నారని, ప్రస్తుతం 70మంది శిక్షణ పొందుతున్నారని చెప్పారు. వనపర్తితోపాటు త్వరలో పెబ్బేర్లో కూడా డీహబ్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో నిర్వాహకులు పర్వతరాజు, అనసూయ, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, టీఆర్ఎస్ నాయకులు ఉంగ్లం తిరుమల్, ఆవుల రమేశ్, ప్రేమ్నాథ్రెడ్డి పాల్గొన్నారు.