కాలానుగుణంగా మనం తినే ఆహారంలో కూడా మార్పులొచ్చాయి. ఉరుకులు, పరుగుల జీవనం, బిజీబిజీలైఫ్ైస్టెల్తో ఆ పూటకు ఏదో ఒకటి తిందాంలే అనుకుంటుంటాం. దీంతో దీర్ఘ కాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. మూడు పూటలా ఆహారం తీసుకున్నా వ్యాధుల బారిన పడుతూ ఉంటాం. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే అసలేం తినాలి..? అనే ప్రశ్న మదిలో మెదలుతూనే ఉంటుంది.
ఏం తింటున్నాం. ఎంత తింటున్నాం.. అనేది ముఖ్యమని.., పీచు పదార్థం, పోషకాలు అధికంగా ఉండే కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవడంతో సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఏదైనా అతిగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
మహబూబ్నగర్ డెస్క్, డిసెంబర్ 6 : మారుతున్న కాలానుగుణంగా మనం తీసుకుంటున్న ఆహారంలో కూడా అనేక మార్పులొచ్చాయి. హడావుడి జీవితం, రోజువారీ పనులతో ఏదో ఒక్కటి తినేసి ఆ పూట గడిస్తే చాల్లే అనుకుంటున్నారు. దీనివల్ల అప్పటికప్పుడు కాకున్నా.. దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. పోషకాహార నిపుణులు, ప్రతిరోజూ మూడు పూటలా ఆహారం తీసుకుంటూనే ఉంటాం. పదార్థాలు తింటూనే ఉంటాం.. అయినా నీరసం వదలదు. వ్యాధుల బారిన పడుతూ ఉంటాం. శరీరాన్ని శక్తివంతంగా చేసుకుని, ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే అసలేం తినాలి..? ఈ ప్రశ్న చాలామందికి మెదలుతూనే ఉంటుంది. ఏం తింటున్నాం. ఎంత తింటున్నాం అనేది ముఖ్యమని, దీంతోపాటు పీచు పదార్థం, ఇతర పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్లనే సంపూర్ణ ఆరోగ్యంతో ఉండగలమని పోషకాహార నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం అంతుచిక్కని రోగాలు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఈ తరుణంలో కూడా శరీరం దృఢంగా తయారై వ్యాధులను తట్టుకునే రీతిలో మార్చుకునేందుకు ప్రతిరోజూ చక్కని సంపూర్ణ ఆహారంతో పాటు వ్యాయామం తప్పనిసరి అని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు.
మొలల వ్యాధికి కాకర దివ్యౌషధం..
మొలల వ్యాధితో బాధపడే వారికి కాకరకాయలు దివ్యాఔషదం. కప్పు కాకరకాయ రసంతో చెంచా తేనె కలిపి నాలుగునెలలపాటు తాగితే బహిష్టు నొప్పులు, కీళ్లనొప్పులు, ఆయాసం తదితర సమస్యలు చాలావరకు తగ్గుతాయి. కాకర నుంచి రసం తీసి అందులో కొంచెం నిమ్మరసం కలిపి పడిగడుపున తాగితే రక్తగడ్డలు, తామర, గజ్జి, దురద మొదలైన వ్యాధులు నయమవుతాయి.
పెరుగు
ఇది ఆరోగ్యానికి చాలామేలు చేస్తుంది. ప్రోటీన్లతో పాటు క్యాల్షియం, బి-విటమిన్ కూడా పెరుగు ద్వారా పుష్కలంగా లభిస్తుంది. నిత్యం పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. వివిధ రకాల ఆహార సంబంధ ఎలర్జీలను చాలా వరకు నివారిస్తుంది. వారానికి కనీసం మూడు నుంచి ఐదుసార్లు పెరుగు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.
బెర్రీపండ్లు..
స్ట్రాబెర్రీ, బ్లాక్బెర్రీ, రాస్బెర్రీ, క్యాన్బెర్రీలు ఈ కోవకు చెందుతాయి. బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ను నిరోదించడమే కాకుండా వివిధ రకాల వ్యాధుల బారి నుంచి రక్షిస్తాయి. వారంలో కనీసం మూడు నాలుగుసార్లు బెర్రీపండ్లు తినడం చాలా మంచిది.
పొట్టు తీయని గోధుమలు..
గోధుమల పైన ఉండే పొట్టుతీయకుండా పిండిచేసి ఆ పిండితో తయారుచేసే బ్రెడ్ ఆరోగ్యానికి చాలా మంచిది. మామూలుగా మార్కెట్లో లభించే బ్రెడ్తో పోలిస్తే ఈ పొట్టు తీయని గోధుమపిండితో తయారు చేసిన బ్రెడ్లో నాలుగున్నర రెట్లు అధికంగా ఫైబర్, ఐదురెట్లు అధికంగా మెగ్నీషియం, నాలుగురెట్లు ఎక్కువగా జింకు, ఏడురెట్లు విటమిన్-బీ ఉంటాయి. అలాగే, పాస్తా, ఓట్మీల్, ముడిబియ్యం, నూడిల్స్ ఇవన్నీ కూడా మన ఆహారంలో ఉండాల్సిందే. హృద్రోగాలు, క్యాన్సర్లు, మధుమేహం, హైపర్టెన్షన్ వంటి వ్యాధులు రాకుండా ఇవి మనల్ని కాపాడుతాయి. తక్కువ కేలరీలు ఉండే ఈ ఆహారపదార్థాలను వారంలో కనీసం మూడు నాలుగుసార్లు తీసుకోవడం ఉత్తమం.
ఆరోగ్యప్రదాయిని బత్తాయి..
ఊబకాయం, షుగర్ వ్యాధులతో బాధపడేవారికి బత్తాయి విరుగుడుగా పని చేస్తుంది. ప్రతిరోజూ ఈ పండ్లరసం తాగితే షుగర్ చాలావరకు అదుపులో ఉంటుంది. రక్తలేమి రుగ్మతులకు బత్తాయి మంచి ఔషధం. గర్భిణులు, బాలింతలకు ఇది మంచి పోషకాహారం.
ద్రాక్షతో క్యాన్సర్ నివారణ..
ద్రాక్షలో ఉండే ఒక రకమైన ఆమ్లాలకు క్యాన్సర్ను అడ్డుకునే లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇందులోని రిస్వెర్డాల్ అనే పదార్థం గుండె జబ్బులు రాకుండా కాపాడుతుందని పరిశోధనల్లో తేలింది. రక్తనాళాలు పూడిపోకుండా, గట్టి పడకుండా మేలు కలిగించేందుకు ద్రాక్ష పండ్లు ఎంతో ఉపయుక్తం.
నారింజ రంగులో ఉండే కూరగాయలు..
నారింజ రంగులో ఉండే గుమ్మడి, దోసకాయ, క్యారెట్, స్వీట్ పొటాటోలో తదితర కూరగాయల్లో బీటా – కెరోటిన్ ఉంటుంది. ఇది కణాల పెరుగుదలకు కణ సముదాయంతో ఏర్పడే టీష్యూల పెరుగుదలకు ఉపకరిస్తుంది. అంతేకాదు బీటా కెరోటీన్ ఉన్న కూరగాయలు వివిధ రకాల క్యాన్సర్ల బారి నుంచి కాపాడుతాయి. ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో వీటిని చేర్చడం ద్వారా రోగ నిరోధకశక్తి పెంపొందుతుంది. ఫలితంగా చీటికి మాటికి జలుబు, తదితర ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి. అలాగే, సూర్యరశ్మీలో ఉండే అతినీలరోహిత కిరణాల కారణంగా చర్మానికి హాని జరగకుండా కాపాడుతాయి.
ఆహారంతో ఆరోగ్యం..
ప్రస్తుత హడావిడి జీవితంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు చక్కని ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ భోజనంలో తప్పనిసరిగా పెరుగు తీసుకోవడం మంచిది. తరుచుగా పండ్లు, ఆకుకూరలు, వంటి ఆహారం పదార్థాలు తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ఆయిల్ఫుడ్, బేకరీ ఫుడ్కు దూరంగా ఉండటం మంచిది. ప్రతిరోజూ మంచి ఆహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.
– అభిరామ్, వైద్యాధికారి
అల్సర్, విరేచనాలకు యాపిల్ బెటర్…
తరచూ యాపిల్పండు తీసుకుంటుండటం వల్ల అల్సర్, విరేచనాలు రావు, యాపిల్లో సి-విటమిన్, సెల్యూలోజ్, చక్కెర, పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఈ పండు చర్మానికి తేమను అందించి, నిగారింపజేస్తుంది.
కిడ్నీలోని రాళ్లు పోవాలంటే..
కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు కర్బూజ పండ్లు బాగా తింటే రాళ్లు కరిపిపోతాయని వైద్యులు అంటున్నారు. అజీర్తి, ఎగ్జియా, మూత్రంలో మంట, తదితర సమస్యలున్న వారు ఈ పండును తిని తగ్గించుకోవచ్చు. పసిపిల్లలకు పుష్కలంగా పాలు ఉండేందుకు బాలింతలు ఈ పండు తినడం అత్యంత శ్రేయస్కరం.
ఆకుకూరలు..
రోజు మనం తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సినవి ఆకుకూరలు. వీటిద్వారా మన శరీరానికి విటమిన్లు, మెగ్నీషియంతోపాటు వివిధ రకాల ఖనిజ లవణాలు, సీ, కే-విటమిన్లు, ఫోలిక్యాసిడ్, క్యాల్షియం, ఐరన్, పొటాషియం అందుతాయి. పాలకూర, తోటకూర, చుక్కకూర, బచ్చలికూర, మెంతికూర, ఇలా రోజుకొక ఆకుకూర తినడం ఆరోగ్యానికి ఎంతోమేలు. పాలకూర తినడం ద్వారా కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించవచ్చు. ఆకుకూరలు జ్ఞాపకశక్తిని పెంచడమే కాకుండా గుండెజబ్బులకు దూ రంగా ఉంచుతాయి. శరీరంలోని ఎముకల నిర్మాణంలో ఆకుకూరలు అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. అలాగే, పేగుల్లో ఏవైనా గడ్డలు ఉంటే తగ్గుతాయి. కంటి చూపునకు ఆకుకూరలకు మించిన ఔషధం లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు.
గొంతునొప్పి తగ్గించే కొత్తిమీర..
ఓ గిన్నెలో కొత్తిమీర తీసుకొని అందులో నీళ్లుపోసి బా గా మరగబెట్టిన తర్వాత వ చ్చిన కషాయాన్ని నోట్లో పో సుకుని పుక్కిలించాలి. దీంతో గొంతునొప్పితో పాటు చిగురువాపులు, పంటి నొప్పులు తగ్గుతాయి.