పెబ్బేరు, మార్చి 27 : ఆక్వా ఫోనిక్స్ విధానంలో చేపలు, మొక్కల పెంపకంతో అధిక లాభాలు ఆర్జించవచ్చని పెబ్బేరు మత్స్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ నాగలక్ష్మి అన్నారు. నేషనల్ మీట్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ సహకారంతో బుధవారం కళాశాలలో ఆక్వా ఫోనిక్స్ విధానంపై ఎస్సీ రైతులకు ఒక రోజు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న కాలానికనుగుణంగా వ్యవసాయ పద్ధతులను అవలంభించాలన్నారు. తక్కు వ స్థలం, తక్కువ నీటితో ఎక్కువ లాభం వచ్చే విధానాలలో ఆక్వా ఫోనిక్ ఒకటని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాయిస్ ఫాతిమా, వ్యవసాయాధికారి చంద్రమౌళి, సిబ్బంది భానుప్రకాశ్, హారిక, రామకృష్ణారెడ్డి, ఓబులేసు ఉన్నారు.