మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మార్చి 18 : వినియోగదారుల కోసం అధునాతన టెక్నాలజీతో కూడిన హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్ బైక్ను విడుదల చేశారు. పట్టణంలోని అశ్విని బైక్ షోరూం నిర్వాహకులు సో మవారం బైక్ను ప్రముఖ బైక్ మెకానిక్ సంఘం ప్రెసిడెంట్లు సిద్ధేశ్వర్, బాలరాజు విడుదల చేశారు. షోరూం మేనేజర్లు అజీం, రాజశేఖర్ మా ట్లాడుతూ ఈ బైక్కు అన్ని ఎల్ఈడీ బల్బులు అమర్చినట్లు, ఇది స్పో ర్ట్స్ బాడీ డిజైన్స్తో ప్రోగ్రాం ఫ్యూయల్ ఇండక్షన్, బాలన్పర్ టెక్నాలజీ కలిగిన ఇంజిన్ ఉందన్నారు. 0 నుంచి 60 కి.మీ. వేగం కేవలం 5.9 నిమిషాలలో అందుకుంటుందని, ఫుల్లీ డిజిటల్ మీటర్తోపాటు బ్లూ టూత్ కనెక్టివిటీ, మొబైల్ చార్జింగ్, ప్రొజెక్టెడ్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్, ఏబీఎస్ టెక్నాలజీ లాంటి ఎన్నో అధునాతన ప్రత్యేకతలు ఈ బైక్లో ఉన్నాయని, ఇది మూడు రంగుల్లో లభ్యమవుతుందని వివరించారు. కార్యక్రమంలో శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్ రీజినల్ మేనేజర్ మధుసూదన్రావు, వినియోగదారులు, సిబ్బంది పాల్గొన్నారు.