నాగర్కర్నూల్, మే 14 : విద్యుత్ వైర్లు తగిలి వరి కోత మిషన్ దగ్ధమైన ఘటన నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని తుమ్మలసూగూరు గ్రామంలో గురువారం చోటు చేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన రైతు భాస్కర్గౌడ్ కౌలు చేస్తున్న వ్యవసాయ భూమిలో పంట కోస్తున్న క్రమంలో ఎల్టీ లైన్ తీగలు కిందికి ఉండడంతో గమనించకుండా వరి కోత మిషన్ కోత నిర్వహిస్తుండగా ప్రమాదం సంభవించింది.
విద్యుత్ తీగలకు తగిలిన వాహనం డీజిల్ ట్యాంక్ పేలి వాహనం మొత్తానికి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాలు కాపాడుకున్నాడు. గ్రామస్తులు వాటర్ట్యాంక్, వ్యవసాయ బోర్ల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా మంటలు తగ్గకపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.