మహబూబ్నగర్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నాలుగో రోజు (సోమవారం) మహబూబ్నగర్, నాగర్కర్నూ ల్ పార్లమెంట్ స్థానాలకు పదిమంది తమ నామినేష న్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. పాలమూరు పార్లమెంట్లో నాలుగు నామినేషన్లు దాఖలు కాగా.. ఇద్దరు ప్రధాన పార్టీ నేతలు, మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులున్నారు.
మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా కె.రామలింగప్ప, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి తరఫున ప్రతినిధి, విడుతలై చిరుతైగల్ కచ్చి (VCK) పార్టీ అభ్యర్థిగా కె.శంకర్రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ఎస్.సరోజనమ్మలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవినాయక్కు నామినేషన్ పత్రాలను అందజేశారు.
నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గ స్థానానికి ఆరుగురు నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి ఉదయ్కుమార్ తెలిపారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా ప్రసంగి, అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫామ్స్ పార్టీ (ఆదార్ పార్టీ) అభ్యర్థిగా అంబోజు రవి, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి తరఫున ఆయన సతీమణి రాజా బన్సీదేవి మల్లు, బీ ఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ (రేపల్లె శివ) ప్రవీణ్కుమా ర్, బీజేపీ అభ్యర్థిగా పోతుగంటి రాములు, పోతుగంటి భరత్ ప్రసాద్ నామినేషన్ వేశారు.