అచ్చంపేట, ఏప్రిల్ 25 : సీఎం కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీతో దేశం లో పెనుమార్పులు సంభవించనున్నాయని నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, విప్ గువ్వల బాలరాజు తెలిపారు. అచ్చంపేట పట్టణంలోని లలితఉమామహేశ్వర జిన్నింగ్ మిల్లు ప్రాంగణంలో మంగళవారం బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి ప్రతినిధుల సభను నిర్వహించారు. సభ ప్రాంగణం నుంచి స్టేజీ వరకు విప్ గువ్వలపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ ప్రపంచం నలుమూలలా తెలంగాణ ఖ్యాతి విస్తరించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి నిమిషం ప్రజా సంక్షేమం, అచ్చంపేట అభివృద్ధి కో సమే కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదిరేది లేదు.. బె దిరేది లేదు.. మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే అని ధీ మా వ్యక్తం చేశారు. నవ భారత నిర్మాణమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే దేశంలో బీఆర్ఎస్ సర్కార్ ఏర్పడాలని ఆకాంక్షించారు.
‘కేసీఆర్ సచ్చు డో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో ముందుకెళ్లి నేడు సుస్థిర పాలన బాటలో పయనిస్తున్నామన్నారు. త్వరలో ఉమామహేశ్వర, చె న్నకేశవ రిజర్వాయర్లకు ముఖ్యమం త్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సాగునీరు అందించి ఈ ప్రాంత ప్రజల రుణా న్ని తీర్చుకుంటానన్నారు. దేశ ప్రజ లు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. అచ్చంపేటలో ఈ సారి 50వేల మెజార్టీతో గెలుస్తామని.. బీఆర్ఎస్ను ప్రజలు నిండు గా దీవిస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. జీబీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్, ఎమ్మెల్యే సతీమణి గువ్వల అమల మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ధనికులకు కొమ్ము కాస్తూ.. మహిళలకు వ్యతిరేకంగా ఉందని మండిపడ్డారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, వైస్ చైర్పర్సన్ శైలజ, మాజీ చైర్మన్ తులసీరాం, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అరుణ, పట్టణ అధ్యక్షుడు రమేశ్, కౌన్సిలర్లు నిర్మల, శివ, మన్నుపటేల్, రమేశ్రావు, రమేశ్, శ్రీను, సోమ్లానాయక్, కుతుబుద్దీన్, నాయకులు పర్వతాలు, శ్రీధర్, నిజాముద్దీన్, బాలరాజు, శ్రీను, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.