మహబూబ్నగర్, జూలై 31 : సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు నిర్వహించిన అర్హత పరీక్ష ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. మహబూబ్నగర్ జిల్లాలో 2156మంది విద్యార్థులకు గానూ 1834మంది హాజరయ్యారు.
నారాయణపేట జిల్లాలో 1246కు 1022మంది, గద్వాల జిల్లాలో 897కు 775మంది, నాగర్కర్నూల్ జిల్లాలో 2051కి 1764మంది, వనపర్తి జిల్లాలో 742 మంది విద్యార్థులకు 609మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మొత్తం 7074 మందికిగానూ 6004మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని సాంఘిక సంక్షేమ ప్రాంతీయ సమన్వయ అధికారి ఫ్లొరెన్స్రాణి తెలిపారు.