జడ్చర్ల, జనవరి 30 : బాదేపల్లి మార్కెట్లో వేరుశనగ ధరలు మంగళవారం తగ్గాయి. సోమవా రం రూ.200 పెరగగా మంగళవారం రూ.80 వర కు తగ్గాయి. కందులకు కూడా క్వింటాకు రూ.90 తగ్గాయి. మంగళవారం మార్కెట్లో వేరుశనగకు అత్యధికంగా క్వింటా రూ.7,307 ధర పలికింది. ప్రధానంగా మార్కెట్కు 4,784 క్వింటాళ్ల వేరుశన గ అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠంగా రూ. 7,307, కనిష్ఠంగా రూ.3,782, మధ్యస్తంగా రూ. 6,689 ధర పలికింది.
అదేవిధంగా 81క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా గరిష్ఠంగా రూ.9,756, కనిష్ఠంగా రూ.9,259, మధ్యస్తంగా రూ.9,756 ధర లభించింది. అలాగే ఆర్ఎన్ఆర్ రకం ధాన్యానికి క్వింటాకు గరిష్ఠంగా రూ.2,991, జొన్నలకు క్వింటాకు గరిష్ఠంగా రూ.5,511, బెబ్బర్లు క్వింటా కు గరిష్ఠంగా రూ.6,579, మొక్కజొన్నకు క్వింటా కు గరిష్ఠంగా రూ.1,921 ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.